పెళ్లి అంటేనే సందడి.. చుట్టాలు, స్నేహితులతో నిండిపోయే మండపంలో ఉన్న కోలాహలం చూస్తే అందరు అక్కడ బిజీబిజీగా కనిపిస్తారు. ఆ హడావుడి అంతా ఇంతా కాదు.. అదే ఇండియాలో అందులో తెలుగు రాష్ట్రాల్లో జరిగే పెళ్లిళ్లు ఎంత ఆర్భాటంగా చేస్తారో చెప్పక్కర్లేదు.  అంగరంగ వైభోగంగా ఈ పెళ్లి వేడుకను నిర్వహిస్తారు.  ఇకపోతే ఏదైన ఫంక్షన్స్ కు ఉత్తి చేతులతో వెళ్లకూడదని బంధువులు, స్నేహితులు వివిధ కానుకలు తీసుకొచ్చి నూతన వధూవరులకు అందజేసి, ఆశీర్వదిస్తారు. దాదాపు అన్ని పెళ్లిల్లో ఇంచుమించుగా ఇలానే జరుగుతుంది.

 

 

ఒక్కోసారి పెళ్లి వేడుకల్లో ఇచ్చే గిఫ్ట్‌లను చూస్తే ఆశ్చర్యంతో పాటుగా, నవ్వు ఆపుకోలేము. ఇటీవలే కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ జంట వివాహం చేసుకుంది. ఆ వివాహ వేడుకల్లో వారికి వచ్చిన గిఫ్ట్‌ను చూసి ఆశ్చర్యపోయారు ఆ నూతన జంట. ఇక బంధువులు, మిత్రులు అందరూ హాజరైన ఆ వేడుకల్లో వరుడి స్నేహితులు కొందరు ఓ రెండు గిఫ్ట్ ప్యాక్ లు అందజేశారు. స్నేహితులు ఏం గిఫ్ట్ ఇచ్చారో చూద్దామని అక్కడే గిఫ్ట్ ప్యాక్ ను ఓపెన్ చేసింది కొత్త జంట.. అంతే ఆ గిఫ్ట్ లో ఉన్న వస్తువులను చూసి షాక్ అయ్యింది.  

 

 

అవేంటో కాదు... ఉల్లిపాయలు.  గత కొన్ని రోజులుగా దేశంలో ఉల్లి ధరలు మండిపోతున్నాయి.  దేశంలో ఉల్లి రూ. 150 నుంచి రూ. 200 వరకు ఉంటోంది.  దీంతో స్నేహితులు రెండు కేజీల ఉల్లిని కొనుగోలు చేసి రెండు పెద్ద గిఫ్ట్ ప్యాక్ లో అందంగా ప్యాక్ చేసి వధూవరులకు అందజేశారు. ఇకపోతే కొన్ని కొన్ని పెళ్లిలలో స్నేహితులు సరదాగా ఆటపట్టించడం మామూలే. ఇలాంటివి అక్కడక్కడ జరుగుతుంటాయి.

 

 

వీరైతే ఉల్లిగడ్డలు ఇచ్చారు, మరికొందరైతే కొత్తజంట బెదిరిపోయేలా మెత్తగా ఉండి పాము గాని తేలు గాని ఆకారంలో ఉండే వాటిని గిఫ్ట్‌గా ఇచ్చి బెదరగొట్తిన సందర్భాలు ఉన్నాయంటున్నారు ఈ ముచ్చట గురించి తెలుసుకున్న కొందరు నెటిజన్స్. ఇకపోతే ఈ ఉల్లిగడ్డల న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. 

మరింత సమాచారం తెలుసుకోండి: