టెక్నాలజీ పెరిగే కొద్ది కొంత మంది మంచి పనులకు వాడితే మరికొంత మంది అనవసరమైన పనులకి వాడతారు. ఇక ఈ మధ్య కాలంలో సెల్ఫీ, వాట్సాప్, టిక్టాక్ లాంటివి చాలా ఎక్కువయిపోయాయి. వీటన్నిటికీ యువత బాగా అకర్షితులవుతున్నారు. అందులో సెల్ఫీ పిచ్చి మాములుగా లేదు. ఎక్కడికెళ్ళినా సెల్ఫీలు తీసుకోవడం బాగా అలవాటయిపోయింది. వాళ్ళు ఏ ప్రదేశంలో ఉన్నాం ఎలాంటి సందర్భాల్లో ఉన్నాం అన్న విషయాల్ని కూడా మర్చిపోతున్నారు. సెల్ఫీలు దిగడం సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం లైక్ల కోసం వెయిట్ చెయ్యడం ప్రజంట్ యూత్ అంతా దీని మీదే ఎక్కెవ కాన్సన్ట్రేషన్. ఇదే సెల్ఫీ మోజుతో అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సెల్ఫీ కారణంగా తలెత్తిన వివాదంతో హైదరాబాద్లో యువతీ యువకుల ఘర్షణకు దారితీసింది. సెల్ఫీ దిగుదామని అబ్బాయిలు కోరగా అమ్మాయిలు నిరాకరించడంతో వివాదం తలెత్తింది.
బాగ్లింగంపల్లిలోని పార్కుకు ఆదివారం సాయంత్రం నల్లకుంట ప్రాంతానికి ఓ ఇంటర్ విద్యార్థిని, తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక కలిసి వచ్చారు. వారిద్దరూ సరదాగా ఆడుకుంటున్న సమయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక స్నేహితులు వారితో మాటలు కలిపారు. ఈ క్రమంలోనే వారు ఇంటర్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించి సెల్ఫీ దిగాలంటూ వేధించారు. దీంతో బాలికలు వారితో ఘర్షణ పడ్డారు.
ఈ ఘటనను చూసి ప్రకాశ్ అనే వ్యక్తి ఆ యువతి తండ్రికి ఫోన్ చేసి మీ అమ్మాయిని ఎవరో వేధిస్తున్నారంటూ ఫోన్ చెప్పాడు. దీంతో ఆయన కొందరిని వెంటబెట్టుకుని పార్కుకి వచ్చి అబ్బాయిలను చితకబాదాడు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం వేళ పార్కులో సరదాగా గడుపుదామని వచ్చిన వారంతా ఈ ఘటన చూసి షాకయ్యారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న చిక్కడపల్లి పోలీసులు ఇరువర్గాలను స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే దీనిపై కేసు పెట్టేందుకు యువతి తండ్రి నిరాకరించారు. పార్కులో గలాటా చేసిన ఘటనపై మాత్రం పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సరదాగా అనుకునే పనులు కొన్ని సందర్భాల్లో సీరియస్ అయ్యే ప్రమాదముంది కాబట్టి ఎప్పుడూ మన ప్రవర్తన మన హద్దులను దాటకూడదు.