మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విధించినా కామాంధుల తీరులో  మాత్రం మార్పు రావడంలేదు. ఎన్ని శిక్షలు పడిన వారి ఆలోచనలో  మాత్రం మార్పు రావడంలేదు. ఆడపిల్ల కనిపిస్తేచాలు కామపు చూపుతో మీద పడిపోయి మరి అత్యాచారాలు హత్యలు చేస్తున్నారు. రోజురోజుకు ఆడపిల్ల జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఇలాంటి జీవితం ఒక జీవితమేనా అని సగటు ఆడపిల్ల బాధ పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే రోజుకో  అత్యాచారం తెరమీదికి వస్తూనే ఉంది. మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా అయిపోయింది. ఇంటా బయట మహిళలను కామంతో చూసేవాళ్ళే రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. 

 

 

 

 ఈ రోజుల్లో సొంత వాళ్ల నుంచి కూడా కనీస రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది. కాగా  దేశంలో రోజుకో  అత్యాచార ఘటన తెరమీదికి వస్తూనే ఉంది. ఒడిషాలో కామాంధులు రెచ్చిపోయారు. రాష్ట్రంలో ఏకంగా వేరు వేరు చోట్ల ఒకే రోజులో ఐదు అత్యాచార యత్నాలు జరిగాయి. దీంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మయూరబాన్జ్  జిల్లా బాదంపహాడ్ ప్రాంతంలో 16 ఏళ్ల బాలికపై నారాయణ మండల్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడగా నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. గజం జిల్లా కళ్లికోట్ లో   నాలుగేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు ఆఘాత్యానికి పాల్పడ్డాడు... బాలేశ్వర జిల్లాలో మరో బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు.

 

 

 

 ఇక రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్లో 45 ఏళ్ల వ్యక్తి ఏడేళ్లబాలికపై కామవాంఛ తో అకృత్యానికి పాల్పడ్డాడు. కటక్లోని ఖాన్ నగర్  ప్రాంతంలోని కాళికాదేవి ఆలయం వద్ద ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. ఇలా కేవలం  24 గంటల్లోనే రాష్ట్రంలో ఏకంగా ఐదు అత్యాచార ఘటనలు చోటుచేసుకున్నాయి. హైదరాబాదులో వైద్యురాలు దిశ పై అత్యాచారం చేసిన నిందితులను దారుణంగా ఎన్కౌంటర్ చేసి చంపినప్పటికి కూడా మృగాల్లాంటి మగాళ్ల ఆలోచనలో  ఎటువంటి మార్పు రావడంలేదు. నెలల నిండని  పసికందు నుంచి పండు ముసలి వరకు దుర్మార్గపు కామపు కోరల్లో చిక్కుకోక తప్పడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: