ఎన్నికల సమయం లో జగన్ ఉద్యోగాల భర్తీ లో ఇచ్చిన హామీ నెరేవేర్చేదిశగా అడుగులు వేస్తున్నారు అయన అధికారం లోకి వచ్చినప్పటి నుండి ఎదో ఒక ఉద్యోగాల భర్తీ చేస్తూనే ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా భారీ ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. గ్రామవాలంటీర్, వార్డ్ వాలంటీర్,గ్రామ సచివాలయ ఉద్యోగాలతో పాటు అంగన్‌వాడీ, ఔట్‌సోర్సింగ్ వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.ఆంధ్ర ప్రదేశ్ లోని  నిరుద్యోగులకు జగన్ సర్కార్ తాజాగా శుభవార్త చెప్పింది డిఎడ్, బీఈడీ చేసిన నిరుద్యోగులకు వరుసగా శుభవార్త త్వరలోఅందిస్తోంది.

 
మెగా డీఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. 7900 పోస్టులతో పూర్తి చేస్తామని, మెగా డీఎస్సీ ఉంటుందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి. మెగా డీఎస్సీ ని. గురించి  విషయాన్ని తెలియజేశారు. ఈ మెగా డీఎస్సీ వచ్చే నెలలో (జనవరి 2020) నిర్వహిస్తామంటున్నారు.

 

మెగా డీఎస్సీపై మంత్రి ప్రకటనతో నిరుద్యోగులు ఆనందమువ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర ప్రదే శ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి సంవత్సరము జనవరి మాసములో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించిన సంగతి అందరికీ కీతెలిసిందే. రాబోయే రోజుల్లో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కార్యక్రమము చేపడతామని.. వచ్చే జనవరిలో నోటిఫికేషన్ ఖచ్చితముగా ఇస్తామని తెలిపారు.

 

ఒక్క ప్రభుత్వ శాఖలో ఒక్క ఉద్యోగం కూడా ఖాళీగా ఉంచే ప్రసక్తే లేదని. చెప్పారు. జనవరి మాసము సమీపిస్తున్నందున నిరుద్యోగులంతా ఉద్యోగ మునకు కావలసిన ప్రిపరేషన్ తో సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పుడు చెప్పినట్లుగానే మెగా డీఎస్సీకి సిద్ధమవుతున్నారు. ఇలా ప్రభుత్వము ప్రతి సంవత్సరము వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తే నిరుఉద్యోగులు ఎంతో సంతోషము ను వ్యక్తపరుస్తారు. చదువుకున్న యువత కు కొంతవరకు జీవనోపాధి కలుగుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: