కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల పోరు ముగిసినట్లే. ఈ నెల డిసెంబర్‌ 5వ తేదీన మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు గాను ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడగా ఊహించని రీతిలో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది.  మొత్తం ఉన్న 15 అసెంబ్లీ స్థానాలకు గానూ భారతీయ జనతా పార్టీ 12 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్‌ 2, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు.

 

 

ఇకపోతే ఈ ఉప ఎన్నికల ఫలితాలను కలుపుకుంటే శాసనసభలో బీజేపీ సంఖ్యా బలం మొత్తం 117 కు చేరింది. కాగా కాంగ్రెస్‌ 68, జేడీ(ఎస్‌) 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం 112. అయితే బీజేపీకి 117 ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో సీఎం యెడియూరప్ప ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని తెలుస్తుంది.. ఇక ఈ సంవత్సరం జూలైలో కాంగ్రెస్, జేడీఎస్‌లకు వ్యతిరేకంగా 17 మంది ఎమ్మెల్యేలు.. తిరుగుబాటు చేయడంతో అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ వారిపై అనర్హత వేటు వేశారు. దీంతో కుమారస్వామి సారథ్యంలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ పతనమై.. యెడియూరప్ప ప్రభుత్వం ఏర్పడింది.

 

 

ఈ నేపథ్యంలోనే మళ్లీ 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇకపోతే ఈ ఎన్నికల విజయం పై ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా తీర్పు వ్యతిరేకంగా వెళ్లిన వారికి ప్రజలు శిక్ష వేస్తారు అనడానికి కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు..

 

 

ఇక  కర్ణాటకలో బిజెపి ఊహించిన దానికంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెలవటంతో పాటు బీజేపీ శ్రేణులు స్వీట్లు పంచు కుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ విజయం సందర్భం గా సీఎం యెడియూరప్ప మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు మంచి భవిష్యత్‌ ఉంటుందని. వీరికి ప్రభుత్వంలో ఉన్నత పదవులిచ్చే అంశంపై రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో మాట్లాడుతానని పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: