రోజురోజుకు అత్యాచారాలు మరి ఎక్కువ అయిపోతున్నాయి. ఎంత ఘోరంగా ఆంట్.. అత్యాచారం నిందితులను ఎన్కౌంటర్లు చేసిన సరే మాకు ఎం అవుతుందిలే అనే ధీమాతో అత్యాచారాలు చేస్తున్నారు. అసలు అంత దైర్యం ఎక్కడ నుండి వస్తుంది ఈ నీచులకు.. మరి అలా అత్యాచారాలు చేసిన వారి వయసు పెద్దదా అంటే అది కాదు చాలా చిన్న వయసు వారు..   

 

రోజురోజుకు అత్యాచారాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇంకా ఒకడు అయితే మరి దారుణంగా నాలుగేళ్ళ ఆడపిల్లపై అత్యాచారం చేశాడు నీచుడు. ఇంకా వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలో కామాంధులు రెచ్చిపోయారు. రాష్ట్రంలో ఒకే రోజు వేర్వేరు చోట్ల ఐదు అత్యాచార యత్నాలు జరిగాయి. మయూరభంజ్ జిల్లా బాదంపహాడ్ ప్రాంతంలో 16 ఏళ్ల బాలికపై నారాయణ మండల్ అనే 25 ఏళ్ళ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.   

 

ఇంకా గంజాం జిల్లా కళ్లికోట్‌లో జరిగిన మరో ఘటనలో నాలుగేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఇది మరి దారుణమైన ఘటన అనే చెప్పాలి. 16 ఏళ్ళ పిల్లోడు అత్యాచారం అంటే అసలు ఎం అవుతుంది ఈ లోకం.. దారుణమైన లోకం. అదే ఒడిశాలో మరో చోట బాలేశ్వర్ జిల్లాలో జరిగిన ఇంకో ఘటనలో బాలికపై యువకుడు అత్యాచారం యత్నం చేశాడు.

 

రాజధాని అయిన భువనేశ్వర్‌లో 45 ఏళ్ల వ్యక్తి ఏడేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కటక్‌లోని కాన్‌నగర్ ప్రాంతంలోని కాళికాదేవి ఆలయం వద్ద ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలు అన్ని 24 గంటల్లోనే చోటుచేసుకున్నాయి. దీంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎన్కౌంటర్ చేసిన మమ్మల్ని కాదు కదా.. మేమెందుకు మారాలి అన్నట్టు ప్రవర్తిస్తున్నారు నీచులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: