ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం వైయస్ జగన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఈ సందర్భంగా విపక్ష నేతలు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.. మహిళలకు రక్షణ లేకుండా పోతుందని తెగ కామెంట్స్ చేశారు.  విపక్ష నేత చంద్రబాబు సైతం ఈ అంశపై పదే పదే ప్రస్తావించారు.  అయితే దానికి కౌంటర్ గా పలువురు సభ్యులు చంద్రబాబు నాయుడికి కౌంటర్ ఇచ్చారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ కు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు..అలాగే తెలంగాణ పోలీసులు నింధితులను అరెస్ట్ చేయడం.. వారిని విచారణ చేస్తున్న సమయంలో తప్పించుకొని అటాక్ చేయగా తమ ఆతర్మరక్షణ కోసం ఎన్ కౌంటర్ చేయడం లాంటి విషయాలు ప్రస్తావించారు.   

 

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  దిశ విషయంలో ఈ వ్యాఖ్యలు చేయటంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  దిశ విషయంలో అనుకోకుండా జరిగిన సంఘటనలో తెలంగాణ పోలీసులు చేసిన పనికి వారికి హ్యాట్సాఫ్ చెప్తున్నానని ఏపీ అసెంబ్లీలో వైయస్ జగన్ ప్రకటించారు.  అంతే కాదు పోలీసులపై కేసులు పెడుతున్న మానవహక్కుల సంఘాలను కూడా తీవ్రంగా విమర్శించారు.

 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిశ విషయంలో జరిగిన సంఘటనలో తెలంగాణ పోలీసులను మెచ్చుకుంటూ వారికి హాట్సాఫ్ చెప్తున్నానని, అసలు దమ్మున్న వాళ్ళు ఇలా చేసినప్పుడు అభినందించాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో ఉన్న మిగతా ఏపీ శాసన సభ్యులు చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

 

అలాగే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత పోలీసులపై  ఢిల్లీ నుండి వచ్చిన మానవహక్కుల సంఘం చేస్తున్న విచారణ సరికాదంటూ ఇలాంటివి సమాజంలోని ప్రజల్లో వ్యవస్థల పట్ల అపనమ్మకాన్ని కలిగిస్తాయని వ్యాఖ్యానించారు.  పోలీస్ వ్యవస్థ గురించి ఇంత గొప్పగా మాట్లాడి.. వారికి హ్యాట్సాఫ్ చెప్పిన సీఎం జగన్ మీరు గ్రేట్ అంటున్నారు ఆంధ్రప్రజ. 

మరింత సమాచారం తెలుసుకోండి: