ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మరి త్రీవ్రంగా మారిపోయాయి. టీడీపీ అధినేత కు ప్రతిఒక్కరు ప్రతిపక్షం లో కూడా అతన్ని చంద్రబాబు అనే పిలుస్తారు వేరే పేర్లతో ఎవ్వరు పిలవరు కానీ అతని కొడుకు లోకేష్ అనగానే పప్పు అని ఏడిపిస్తునే ఉంటారు.మిత్రపక్షం, ప్రతిపక్షం, సాధారణ ప్రజలు కూడా అతనివల్ల బాధ కలిగినప్పుడల్లా పప్పు పప్పు అని పిలిచి చంద్రబాబు కు తలనొప్పిని తెచ్చి పెడుతున్నాయ్ అని సమాచారం.
అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలుమొదలయ్యాయి ఇక వైసీపీ ఎమ్మెల్యే లతో తల భారం మెదలైంది అని అనుకోవచ్చు. ఈ రాష్ట్రంలో ఆడబిడ్డల మానప్రాణాల భద్రత విషయంపై చంద్రబాబుకు బాధ లేదుఅని ఉల్లి మీద ఉన్న ప్రేమ ఆడపిల్లల మీద లేదు అని ఎందుకంటే చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టి అని రోజా అరోపించారు. చంద్రబాబు కు ఉల్లి మీద ప్రేమ లోకేష్కు పప్పులో ఉల్లి లేదని చంద్రబాబు బాధపడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.
మహిళల భద్రతపై మరియు వారి హత్య అత్యాచారాల పైన చర్చిస్తుంటే ఉల్లి కోసం టీడీపీ గొడవ చేస్తుందని దీనిని బట్టి మహిళల పట్ల టీడీపీకి ఎంత చిత్తశుద్ధి ఉందొ అర్థమవుతుందని విమర్శించారు. దిశ ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టించాయని చంద్రబాబు ఈ చర్చ మొదలు పెడితే చంద్రబాబు అయాం లో జరిగిన కాల్మనీ సెక్స్ రాకెట్ మరియు మహిళలపట్ల, హీరోయిన్ ల పట్ల చేసిన బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎక్కడ మాట్లాడుతారో అన్న భయం పట్టుకుందన్నారు. అయన లేవనెత్తిన అంశం ఉల్లిపాయల గురించి కూడా చర్చించేందుకు సమయం కేటాయిస్తామని సీఎం చెప్పారు అని కూడా చెప్పారు.
ముందుగా ఆడపిల్లల భద్రతపైనా చర్చించాలని తీసుకున్న నిర్ణయాన్ని కూడా వారు రాజకీయం చేస్తున్నాయని కానీ ఆడవాళ్ల భద్రత గురించి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు. దిశ సంఘటన తరువాత ఆడవాళ్లు కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లాలంటే భయపడ్డారని కానీ ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేస్తే మహిళలు సంబరాలు చేసుకున్నారు అని రోజా అన్నారు.