దేశ వ్యాప్తంగా సంచలనం షృష్టించిన దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ వ్యవహారం సుప్రింకోర్టుకు వెళ్లింది. కొందరు న్యాయవాదులు ఈ ఎన్ కౌంటర్ పై విచారణ జరపాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.  దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసుపై తీసుకోవాలని కోరుతూ వారు ఈ పిల్ దాఖలు చేశారు. ఎన్‌కౌంటర్‌‌‌కు సంబందించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. 

 

న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ యాదవ్ ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం . 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పోలీసులు పాటించలేదని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మహారాష్ట్రకు సంబంధించిన ఓ కేసును ఉటంకిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. 

 

ఈ కేసులో కూడా పోలీసుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? అని హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. అయితే, ఎన్‌కౌంటర్ మీద మాత్రం ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. దీనిపై చీఫ్ జస్టిస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏదో చేయాలి కాబట్టి చేశామనే విధంగా ఉండకూదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిటిగేషన్ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ఇక్కడ కూడా అనుసరించాలని కోర్టు స్పష్టం చేసింది. అంటే ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పోలీసుల మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 

సుప్రీం కోర్టులో గత జులైలో ఓ కేసు విచారణ జరిగిన సంధర్భంగా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఓ కీలక వ్యాఖ్య చేసింది. పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో ఎవరైనా చనిపోతే ఆ పోలీసు పై ఎఫ్ ఐ ఆర్ నమోదు అవుతుందని ఆ పోలీసుపై కోర్టులో విచారణ జరుపుతుందని స్పంష్టం చేసారు. మరోవైపు 2006లో ఎనిమిది మంది నక్సల్స్ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఓ తీర్పు చెప్పింది. ఆత్మరక్షణ పేరుతో పోలీసులు చట్టం నుంచి తమను తాము రక్షించుకోలేరని, మెజిస్ట్రేట్ దర్యాప్తును పూర్తిస్థాయి విచారణగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఇవన్నీ చూస్తుంటే దిశ నిందితుల ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్  నమోదు అయ్యే అవకాశం కనిపిస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: