మ‌రో ఆడబిడ్డ అగ్నికి ఆహుతి అయింది. త‌న‌ను ప్రేమించాల‌ని కోరితే...ఆ ప్ర‌పోజ‌ల్‌ను తిరస్క‌రించినందుకు అత్యంత దారుణంగా ఆమెను అంతం చేసే ఎత్తుగ‌డ వేశాడు దుర్మార్గుడు. ఆమె ఇంట్లోకి చొర‌వ‌డి...పెట్రోల్ పోసి చంపాల‌ని ప్లాన్ వేశాడు. త‌ను ప్రేమించిన యువతి దక్కడంలేదనే ఆగ్రహంతో ఒంటరిగా ఉన్న బాధితురాలిని గుర్తించి...త‌ల్లిదండ్రులు లేని స‌మ‌యంలో యువతిపై కిరోసిన్ పోసి తగలబెట్టాడు. మంటల్లో ఆహాకారాలు చేస్తున్న బాధితురాల్ని గమనించిన స్థానికులు అత్యవసర చికిత్స కోసం శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్ కు చెందిన ఆస్పత్రికి తరలించారు. బీహార్ ముజఫార్ పూర్ లో ఆహియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నిందితుడిని రాజారాయ్ అనే వ్య‌క్తిగా పోలీసులు గుర్తించారు.

 

బాధితురాలి త‌ల్లి  మీడియాతో మాట్లాడుతూ...పోలీసుల నిర్ల‌క్ష్యం వ‌ల్లే త‌న బిడ్డ క‌న్నుమూసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. నిందితుడు రాజారాయ్ తన కూతుర్ని ప్రేమిస్తున్నానని 3 సంవత్సరాలుగా వేధిస్తున్నాడని,ఆయ‌న వేధింపులు త‌ట్టుకోలేక‌, భయంతోనే కాలేజీ మాన్పించి ఇంటి నుంచే చదివిస్తున్నట్లు తెలిపింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు పోలీసుల్ని ఆశ్రయించినా ఫలితం లేదని కన్నీటి పర్యంతమైంది. శనివారం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో నైట్ షిప్ట్ లో పనిచేసేందుకు తాను వెళ్లినట్లు, అదే సమయంలో నిందితుడు ఇంట్లోకి చొరబడి తన కుమార్తెను కిరోసిన్ పోసి నిప్పంటించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.  మొహం, ఊపిరితిత్తుల‌తో పాటు 50శాతం శరీరం కాలిపోవడంతో బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.


ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న ఏఎస్సై జాహ్ విచారణ ప్రారంభించారు. ఈ దారుణంపై ముజఫర్ ఫూర్ ఎస్ ఎస్ ఎస్పీ జయంత్ కాంత్ మాట్లాడుతూ ప్రపోజల్ ను తిరస్కరించిందనే అకారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిర్ధారించారు. నిందితుణ్ని జుడీషియల్  కష్టడీకి తీసుకున్నట్లు చెప్పారు. బాధితురాలి తల్లి పోలీసుల తీరుపై చేసిన వ్యాఖ్య‌ల‌పై వివ‌రాలు తెలుసుకుంటామ‌న్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: