ఈ రోజుల్లో  సెల్ఫోన్ ప్రభావం జనాలపై  బాగా పెరిగిపోతుంది. కనీసం సెల్ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఇక సెల్ఫోన్ లేకుండా ఓ గంట సేపు ఉన్నారంటే పిచ్చిపిచ్చిగా ప్రవర్తించే వాళ్లు  కూడా చాలామంది ఉన్నారు. సెల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు లోకాన్ని మరిచిపోతారు  జనాలు... రోడ్డు మీద నడుస్తూ కూడా సెల్ ఫోన్ ని చూస్తూనే ముందుకు వెళ్తూ ఉంటారు. రోజురోజుకు జనాల్లో సెల్ ఫోన్ పిచ్చి పెరిగిపోతున్న తరుణంలో ఇక్కడ ఒక భార్యకు కూడా సెల్ ఫోన్ పిచ్చి బాగా పెరిగిపోయింది. తన భర్తను సెల్ ఫోన్ కొనివ్వాలని  అడిగింది... అయితే  భర్త రేపు మాపు అంటూ ఆలశ్యం చేస్తున్నాడు. అంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు భార్య తన కట్టుకున్న భర్త పైన ఇనుప రాడ్లతో దాడి చేసి తల పగలకొట్టింది  .

 

 

 

 ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... స్థానిక తారకరామా నగర్ కు చెందిన పార్ల  నిత్యానందం కుమారి ప్రియదర్శిని భార్య భర్తలు. అయితే భార్య కుమారి ప్రియదర్శిని కి సెల్ ఫోన్ వాడడం అంటే చాలా ఇష్టం. ఈ నేపథ్యంలో తన భర్తను సెల్ ఫోన్ కొనివ్వలని కుమారి గత కొంతకాలంగా భర్తను అడుగుతూ వస్తుంది. అయితే భార్య  సెల్ ఫోన్ కొనివ్వాలని  అడిగిన ప్రతిసారీ భర్త నిత్యానందం హా... కొనిస్తాలే అంటూ తప్పించుకుంటున్నాడు . ఇలా చాలా రోజులు గడిచిపోయాయి. ఇక సదరు భార్యకు కూడా సెల్ ఫోన్ పై పిచ్చి రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది.

 

 

 

 ఇక సెల్ఫోన్ కొనివ్వాలి అని మరోసారి ఈ  విషయమై సోమవారం ఇద్దరు భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. ఏకంగా భార్య సెల్ ఫోన్ కొనివాళ్లంటూ భర్తపై కేకలు వేసింది. ఇక భర్త సెల్ ఫోన్ కొనివ్వట్లేదు  అన్న కోపంతో ఏడాది వయసున్న కొడుకుని కొట్టి ఏడిపించింది భార్య. ఏడుస్తున్న తన కొడుకును ఒళ్లోకి తీసుకునేందుకు భర్త ప్రయత్నించాడు. ఇక అప్పటికే కోపంతో ఊగిపోతున్నా కుమారి ఫ్యాన్ రాడ్ తో భర్త తలపై దాడి చేసింది. ఇంకేముంది భర్తల చిట్లి రక్తస్రావం అయిపోయింది. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధిత భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా సెల్ ఫోన్ పిచ్చి ఉండాలి కానీ ఆ  పిచ్చి ముదిరితే మాత్రం చాలా కష్టమే సుమీ .

మరింత సమాచారం తెలుసుకోండి: