సమాజంలో రోజురోజుకు మనుషుల మధ్య బంధాలు... అనుబంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. బంధాలు, అనుబంధాలు కంటే డబ్బు, వ్యామోహం, ఇతరత్రా కోరికలు డామినేట్ చేస్తున్నాయి. భర్తకు భార్య మీద అనుమానం... భార్యకు భర్త మీద అనుమానం. కలిసి కాపురం చేస్తున్న వాళ్లు కూడా ఎవరు ఎవరిని నమ్మలేని పరిస్థితి. ఈ క్రమంలోనే సెల్ ఫోన్ కొనివ్వలేద ని కూడా భార్య భర్తపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది అంటే పరిస్థితులు ఎంత గా దిగజారిపోతున్నాయో ? తెలుస్తోంది.
సెల్ఫోన్ కొనివ్వలేదని ఓ మహిళ భర్తపై ఇనుప రాడ్తో దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన అతడిని కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ దుమ్ములపేట తారకరామా నగర్కు చెందిన పర్ల నిత్యానందం, కుమారి ప్రియదర్శిని భార్యాభర్తలు.. కొంతకాలంగా సెల్ఫోన్ కొనివ్వమని ప్రియదర్శిని నిత్యానందాన్ని కోరుతోంది. త్వరలో కొంటానని అతను చెప్పుకుంటూ వస్తున్నాడు.
ప్రతి రోజు ఆమె సెల్ ఫోన్ కావాలంటూ భర్తను వేధిస్తూనే వస్తోంది. ఈ క్రమంలో సోమవారం మరోమారు ప్రియదర్శిని సెల్ కోసం గొడవ పెట్టింది. భర్త తర్వాత కొంటానని చెప్పడంతో ఆ కోపం మొత్తం తన కుమారుడిపై చూపించింది. ఏడాది వయసున్న పిల్లాడిని కొట్టి ఏడిపించింది. ఆ సమయంలో నిత్యానందం పిల్లాడిని తన దగ్గరకు తీసుకునేందుకు ప్రయ త్నించాడు.
కోపోద్రిక్తురాలైన ప్రియదర్శిని ఫ్యాన్ రాడ్ తీసుకుని భర్త తలపై గట్టిగా మోదింది. ఆ దెబ్బ గట్టిటా తగలడంతో భర్త నిత్యానందం వెంటనే కింద పడిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న నిత్యానందాన్ని స్థానికులు జీజీహెచ్కు తరలించారు. పోర్టు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీనిని బట్టి సెల్ ఫోన్ అనేది మనిషి జీవితాన్ని ఎలా మార్చేస్తుందో ? మని జీవితంలో ఎలా చిచ్చు పెడుతుందో ? అర్థమవుతోంది.