శీతాకాల సమావేశాల సందర్భం గ  ఏపీ అసెంబ్లీ లో మొదటి రోజు గందర గోల పరిస్థితి నెలకొన్నది. సమావేశాల రెండొవ రోజు కూడా   వాడి వేడి చర్చలు జరిగాయి ఈ చర్చల్లోభాగంగా  ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి స్పీకర్ మాట్లాడే అవకాశం ఇచ్చారు దానితో  టీడీపీ కి చెందిన ఎమ్మెల్యే లు ఒక్కసారిగా  ఆందోళన కి దిగారు .. వంశీకి  మాట్లాడేందుకు ఎట్లా అవకాశం ఇస్తున్నారని చంద్రబాబు కోపం  వ్యక్తం పరిచారు .

 

ముందుగా రైతు పంటలకు మద్దతు ధరపై చర్చ జరగాలంటూ  వంశీని మాట్లాడకుండా అడ్డుకున్నారు. తమ బండారం ఎక్కడ బయటపెడుతానని భయపడి చివరకు స్పీకర్ వినక వంశీకి మాట్లాడటానికి అవకాశం ఇవ్వటం తో బాబు టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుండి  వాకౌట్ చేశారు..ఇక సభలో చంద్రబాబు టీడీపీ నేతలు సభ నుండి బయటకు వెళ్లిన తర్వాత వంశీ మాట్లాడారు.

 

తాను టీడీపీ సభ్యుడిగా కొనసాగలేనని.. తనకు ప్రత్యేక సభ్యుడిగా గుర్తింపు ఇవ్వాలని  స్పీకర్ ను అభ్యర్థించాడు. దీంతో స్పీకర్ వంశీ ప్రతిపాదనను పరిశీలిస్తానని..  మీరు అసెంబ్లీ లో ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చని  వంశీకి సూచించారు.ఇక తాను తన  నియోజకవర్గ సమస్యల గురిన్చే  సీఎం జగన్ ను కలిశానని వంశీ సభలో చెప్పుకొచ్చారు. ఏపీలో ఇంగ్లీష్ మీడియం సహా ఆరోగ్య శ్రీని ప్రవేశపెట్టి సీఎం జగన్ పేదల పక్షపాతిగా వ్యవహరించారన్నారు.

 

ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు - టీడీపీ ఎమ్మెల్యేలు తనను మాట్లాడనీయకుండా చేయడంపై వంశీ ఫైర్ అయ్యారు. చంద్రబాబు గారు మాకు హక్కులేదా మేం ప్రశ్నించకూడదా అని ప్రశ్నించారు. పప్పూ బ్యాచ్ కులం పేరుతో తల్లిదండ్రులను కించపరుస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని వంశీ మండిపడ్డారు. పప్పూ బ్యాచ్ కి జయంతికి - వర్ధంతికి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. తనకు భయపడే చంద్రబాబు బయటకు వెళ్లిపోయాడని కౌంటర్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: