సోషల్ మీడియా ను అడ్డు పెట్టుకుని రెచ్చిపోతున్న వారి సంఖ్య మరింత పెరుగుతోంది. వ్యక్తుల అభిప్రా యాలకు సోషల్ మీడియా పెద్ద వేదిక. ఇఖ సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని రెచ్చిపోయే వారు పెరుగుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ అధినేత, సీఎం జగన్పై సోషల్ మీడియాలో టీడీపీకి చెందిన పచ్చబ్యాచ్ మరింతగా రెచ్చిపోతోంది. నిన్న అసెంబ్లీ తొలి రోజు సమావేశాల్లో మహిళల భద్రతపై మాట్లాడిన సీఎం జగన్.. బేగావ్(బహుభార్యత్వం)పై మాట్లాడుతూ.. తనకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, తల్లి, చెల్లి ఉన్నారని, భార్య కూడా ఉందని, అయితే, తనకు ఒక్కతే భార్య ఉందని పేర్కొంటూ.. రాష్ట్రంలో బహుభార్యత్వం కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అన్నారు.
అయితే, జగన్ వ్యాఖ్యలను రాష్ట్రంలోని ఓ పార్టీ అధినేతకు ఆపాదిస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు సహా శ్రేణులు నానా యాగీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా లేనిపోని వ్యాఖ్యలు కుమ్మరి స్తున్నారు. ``నాకు ఓక్కటే భార్య అంటున్నావ్ మరి 2004 లో నీ అయ్య ముఖ్యమంత్రి కాగానే ఇంకో పెళ్లి చేసుకుంటా అని నువ్వు ఎగరడం, మీ మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి మీ అంతుచూస్తా అని వార్నింగ్ ఇస్తే మీ నాయన ఆ బిడ్డకు అన్యాయం చేస్తే మనకు పులివెందుల లో పుట్టగతులు ఉండవు అని మొత్తుకోవడం ఏవరికీ తెలీదనుకోకు...``- అని ఓ పోస్టు చేశారు. కానీ, జగన్ ఎప్పుడూ అలా వ్యాఖ్యానించిన సందర్భాలు లేనే లేవు.
పచ్చ బ్యాచ్ చెత్త గాండ్రింపులు ఎలా ఉన్నా పులివెందులలో పుట్టగతులు ఉండకపోవడానికి ఆయనేమీ చంద్రబాబుకాదు.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లోకూడా 90 వేల ఓట్ల మెజారిటీతో జగన్ పులివెందులలో సింహం మాదిరిగా విజయం సాధించారు. చంద్రబాబు ముక్కీమూలిగీ 30 వేల ఓట్లతో గెలుపు గుర్రం అతి కష్టంమీద ఎక్కాడు. ఇక, మరో పోస్టులో.. ``200 బెడ్రూం గదులున్న బెంగుళూరు ఎలహంక ప్యాలెస్ లో గదికో అమ్మాయి చోప్పున నీ శాడిజానికి నలిగిపోయారు. నీ శాడిజానికి బలై అగ్ర హీరోయిన్ గా వెలగాల్సిన టాలెంట్ ఉన్న ఓక నటి తెలుగు ఇండస్ట్రీనే వదిలిపోయింది. అది ఏవరి ఖాతాలో వేస్తావు... నీ పేపర్, ఛానల్ ఆ పేరు నుంచి ఉద్భవించినవే కదా``- అని పిచ్చి రాతలు రాస్తూ బోడి గుండుకు మోకాలికి లింకు పెట్టడంలో పచ్చ బ్యాచ్ తమను తామే మించిపోయింది. అసెంబ్లీలో మహిళకుల సంబంధించిన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు దానిని అడ్డుకునేందుకు టీడీపీ వాళ్లు విశ్వ ప్రయత్నాలు చేశారంటేనే వాళ్లు ఎంత సంకుచితత్వంతో ఉన్నారో తెలుస్తోంది.
అయితే, జగన్ పై ఇలాంటి ఆరోపణల మాట పక్కన పెడితే.. టీడీపీ నెంబర్ 2, జాతీయ ప్రధాన కార్యదర్శి చిన్నబాబు విదేశాల్లో పలువురు అమ్మాయిలతో తిరిగిన, మందుకొట్టిన ఫొటోలు ఈ ప్రపంచం ఇంకా మరిచిపోలేదనే విషయం ఈ పిచ్చి తమ్ముళ్లు గుర్తు పెట్టుకోవాలని ఇప్పుడు వైసీపీ వాళ్లు అదే సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు వేస్తున్నారు. పైగా సాక్షి అనేది ఎవరో హీరోయిన్ కోసం పెట్టిన పేరంటున్నారు. ఒకనాడు.. పత్రిక వివాదంపై స్పందిస్తూ... సాక్షాత్తూ జగన్ మాతృమూర్తి విజయమ్మ.. చేసిన ప్రకటన కూడా వీరు మరిచిపోయారు. ``ప్రభువు సాక్షిగా ఈ పత్రికను పెట్టుకున్నాం. అందుకే దానికి సాక్షి అని పేరు పెట్టాం`` అని ఆమె వెల్లడించిన సందర్భం ఇంకా ప్రజలకు గుర్తుంది. మరి ఇలా పిచ్చి పిచ్చి రాతలు రాయడం ఏమేరకు సమంజసమో తమ్ముళ్లు ఆలోచించుకోవాలని అంటున్నారు ఆంధ్రప్రజ.