ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబుపై, అతని సుపుత్రుడు నారా లోకేష్ పై అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటి అనుకుంటున్నారా.. అదేనండి బాబొరికి 25 ఏళ్ళు.. చిన్న బాబొరికి 75 ఏళ్ళు అంటి అంబటి రాంబాబు కామెడీ కథ చెప్పారు.. 

                

ఆ కథ విని అసెంబ్లీలో వైసీపీ నాయకులు, టీవీ చూసే ప్రజలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. అంత కామెడీ కథ ఏంటబ్బా అని అనుకుంటున్నారా ? అదేనండి.. చంద్రబాబు మాట్లాడుతూ అతను 151 మంది ఎమ్మెల్యేలను ఎదుర్కోగలనని అన్నారు. అతని వయసు గురించి పదే, పదే అంటున్నారని, తన వయసు ఎంత అయినా, తాను 25 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిలా ఆలోచించగలనని అతను అన్నారు. అతని ఆలోచనలు చాల ప్రోగ్రెసివ్ గా ఉంటాయని అన్నారు. 

            

దీంతో ఆ డైలాగ్ ను ఊపందుకున్న అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు పాతికేళ్ల వయసులో ఆలోచనలు చేస్తుంటే, ఆయన కొడుకు మాత్రం డెబ్బై ఏళ్ల మాదిరి ఆలోచిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక చంద్రబాబు మతిమరపుతో మాట్లాడుతున్నారని, ఈనాడు అనే బదులు పదే, పదే సాక్షి అని అంటున్నారని అంబటి రాంబాబు అన్నారు. 

 

అసత్యాలు,అబద్దాలను చంద్రబాబు గుక్కతిప్పకుండా చెప్పగలరని, చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని అయన అన్నారు. హెరిటేజ్ గురించి అబద్దాలు ఆడారని, దానిని మంత్రి రుజువు చేశారని ,ఇప్పుడు రాజీనామా చేసి వెళతారా అని చంద్రబాబుని ప్రశ్నించారు. దీంతో ప్రస్తుతం 25 ఏళ్ళ చంద్రబాబు.. ఇంకా అతని 70 ఏళ్ళ సుపుత్రుడు నారా లోకేష్ ధీ హాట్ టాపిక్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: