ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ చరిత్రలో ఈరోజుని ఒక దుర్దినంగా భావిస్తున్నామని, ప్రధానసమస్యలు పరిష్కారమయ్యే ప్రశ్నోత్తరాల సమయంలో, మొదటిగంటలో సభ్యులు అడిగేప్రశ్నలకు గండికొడుతూ, వైసీపీ ప్రభుత్వం కొత్తసంప్రదాయాన్ని సృష్టించిందని టీడీపీసీనియర్‌నేత, ఆపార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆగ్రహం వ్యక్తంచేశారు.  అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షనేతైన చంద్రబాబునాయుడికి మైక్‌ ఇవ్వకుండా ఆయన్ని అవమాని ంచడాన్ని నిరసిస్తూ మంగళవారం టీడీపీ సభ్యులందరూ వాకౌట్‌చేశారు.  ప్రతిపక్షసభ్యులకు మాట్లాడటానికి అవకాశమిచ్చి, ప్రశ్నోత్తరాల సమయం జరగకుండా చేయడం బాధాకరమన్నారు. 


పార్టీ మారాలని నిర్ణయించుకున్న వ్యక్తి, ఆపార్టీకి రాజీనామాచేయకుండా అసెంబ్లీకివస్తే, సదరు వ్యక్తికి ప్రత్యేకస్థానం ఇవ్వాలని స్పీకర్‌లాంటి వ్యక్తే చెప్పడం సిగ్గుచేటన్నారు. పార్టీ మారితేనే తమపార్టీలో చేర్చుకుంటామని చెప్పిన, జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు టీడీపీనుంచి వెలివేయబడ్డ వ్యక్తికి ప్రత్యేకస్థానం ఎలా ఇస్తారని బుచ్చయ్యచౌదరి ప్రశ్నించారు. గతంలో నేను కూర్చునే స్థానం మార్చాలని అనేకసార్లు కోరినా స్పందించని స్పీకర్‌, నేడు ఉన్నపళంగా ప్రతిపక్షపార్టీ సస్పెండ్‌చేసిన వ్యక్తికి అసెంబ్లీలోస్థానం కల్పించడం దారుణం కాదా అని ఆయన చౌదరి ప్రశ్నించారు. 


గౌరవంగా వ్యవహరించాల్సిన స్పీకర్‌, ద్వందప్రమాణాలు పాటిస్తున్నాడని,  అత్యున్నతస్థానంలో ఉన్నవారు పచ్చిబూతులు తిడుతున్నా స్పందించకపోవడం విచారకర మన్నారు. సన్నబియ్యానికి, నాణ్యమైన బియ్యానికి తేడాచెప్పమని తాముకోరితే, అదివదిలేసి ముఖ్యమంత్రి మాటతప్పరు.. మడమతిప్పరని డబ్బాలు కొట్టుకుంటున్నారన్నారు. గతంలో సీఎంచేసిన వాగ్ధానాలు, చెప్పినమాటలు చూపించకుండా, వారికి అవసరమైనవాటినే అసెంబ్లీలో ప్రదర్శించారని బుచ్చయ్య పేర్కొన్నారు. ప్రతిపక్షానికి అవకాశమివ్వకుండా మంత్రులతో తిట్టిస్తూ, సభను దారితప్పిస్తున్నారన్నారు.

 

 ప్రజలిచ్చిన మెజారిటీని అపహస్యం చేస్తూ, ప్రతిపక్షాన్ని చీల్చేలా రాజకీయాలు చేయడం అధికారపార్టీ మానుకోవాలన్నారు.  స్పీకర్‌ వ్యవహారశైలి ఎలా ఉండాలో ఆయనకే తెలియడంలేదన్నారు. పార్టీ విధానాలకు అనుగుణంగా సభను నడిపితే, రాష్ట్రం ఎటుపోతుందో చెప్పాల్సినపనిలేదన్నారు. తనను గెలిపించిన పార్టీకి రాజీనామా చేయకుండా రెబల్‌గా ఉండే వ్యక్తికి ప్రత్యేకస్థానం ఇవ్వడం అసెంబ్లీ నియమావళికి విరుద్ధమన్నారు.  వంశి ఉదంతంతో పాటుగా సభలో ఉల్లిపై కూడా పెద్ద చర్చ జరిగింది.  ఉల్లి విషయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి సభలో వాద ప్రతివాదనలు జరిగాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: