హోమ్ లోన్స్‌పై ఈఎంఐ చెల్లించే వారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ తాజాగా ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ప్రత్యక్షంగానే రుణ గ్రహీతలకు ప్రయోజనం కలుగనుంది. ఈ సందర్భంగా రేట్ల తగ్గింపు నిర్ణయం ఈ రోజు నుంచే అమలులోకి వచ్చింది. దేశీ అతిపెద్ద బ్యాంక్ అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు తీపికబుర్లు ఈ మద్యకాలంలో పలుమార్లు అందించిన విషయం తెలిసిందే..

 

 

ఇకపోతే ఇప్పుడు ఈ ఎంసీఎల్ఆర్ ఏకంగా 7.9 శాతానికి దిగివచ్చి, దాదాపు 60 బేసిస్ పాయింట్ల మేర ఎంసీఎల్ఆర్ తగ్గింది. గాని గతేడాది డిసెంబర్ నెలలో ఎస్‌బీఐ ఎంసీఎల్ఆర్ 8.5 శాతంగా ఉంది. ఇక  ఎస్‌బీఐ అందించే హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు, పలు అంశాల ప్రాతిపదికన మారుతూ ఉంటుంది. అందుకే లోన్ అమౌంట్, క్రెడిట్ స్కోర్, రుణ గ్రహీత వంటి పలు అంశాలు వడ్డీ రేట్లపై ప్రభావం చూపుతాయి. ఇదే కాకుండా 2019 డిసెంబర్ 10 నుంచి ఎంసీఎల్ఆర్‌తో లింక్ అయిన హోమ్ లోన్స్‌పై ఎంసీఎల్ఆర్ రేటు 7.9 శాతానికి దిగిరానుంది.

 

 

దీంతో ఎంసీఎల్ఆర్‌తో అనుసంధానమైన లోన్ తీసుకున్న వారికి లాభం కలుగనుంది. ఎంసీఎల్ఆర్ తగ్గింపుతో లోన్ తీసుకున్న వారు ఈఎంఐ భారం తో పాటుగా వడ్డీ భారం తగ్గనుంది. ఇకపోతే స్టేట్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ ఏడాది కాలంలో 0.6 శాతం దిగిరావడంతో ఈఎంఐ భారం రూ.1,000కు పైగా తగ్గుతుంది. అదేసమయంలో వడ్డీ రూపంలో మొత్తంగా రూ.1.90 లక్షల వరకు ఆదా అవుతుంది. దీంతో లోన్ తీసుకున్న వారు మొత్తంగా రూ.2 లక్షలకు పైగా ఆదా చేసుకోవచ్చు.

 

 

ఇక ఎంసీఎల్ఆర్ తగ్గింపు నేపథ్యంలో బ్యాంక్ లోన్ తీసుకున్న వారకి రెండు ఆప్షన్లు ఇచ్చే అవకాశముంది. ఒకటేమో ఈఎంఐ భారాన్ని తగ్గించడం. లేదంటే లోన్ కాల పరిమితిని కుదించడం. ఈ రెండు మార్గాల్లో తగ్గించిన ఎంసీఎల్ఆర్ ప్రయోజనాన్ని బ్యాంక్ కస్టమర్లకు బదిలీ చేస్తుంది. ఇదే కాకుండా స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లకు వివిధ రకాల రెగ్యులర్ హోమ్ లోన్స్, ఫ్లెక్సీపే హోమ్ లోన్, ప్రవివేజ్ హోమ్ లోన్, శౌర్య హోమ్ లోన్, ప్రిఅప్రూవ్డ్ హోమ్ లోన్, రియల్టీ హోమ్ లోన్, బ్రిడ్జ్ హోమ్ లోన్ వంటి రుణాలను ఆఫర్ చేస్తోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: