అసెంబ్లీ వేదిక గా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విసురుతోన్న వ్యంగ్యాస్త్రాలు ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం తిప్పికొట్టే ప్రయత్నాలను చేస్తోంది . నారా లోకేష్ కు మంగళగిరి అని పలకడం కూడా చేతకాదని , చంద్రబాబు మంద బుద్ది కుమారుడు లోకేష్ అని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలకు ధీటుగా , టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేసింది . జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు తన ప్రసంగం లో తడబడ్డారో చెబుతూ , ఆయా క్లిప్పింగ్ లతో ఒక వీడియోను రూపొందించి ట్విట్టర్ లో పోస్టు చేసింది .

 

ఈ వీడియో కు ఒక పప్పు బ్యాచ్ ఉంది సార్ అంటూ టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చేసిన వ్యాఖ్యలను క్యాప్షన్ గా పెట్టారు . ప్రస్తుతం ఈ వీడియో వైరల్ ఆ మారింది . ఇక నారా లోకేష్ మాట్లాడుతూ తాను తెలుగు తప్పుగా మాట్లాడడం వల్ల పోలవరం పనులు ఆగిపోయాయా?, లేకపోతే ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం జరిగిందా ?? అంటూ ప్రశ్నించారు . తాను ఎనిమిదేళ్లు విదేశాల్లో ఉండడం వల్ల తన తెలుగు కొంచెం అటు , ఇటుగా ఉందేమో కానీ తానేమి 43  వేల కోట్ల రూపాయలను దోచుకుని జైలువెళ్లి రాలేదని పరోక్షంగా జగన్ పై విరుచుకుపడ్డారు .

 

చంద్రబాబు నాయుడు తన కొడుకును కూడా గెలిపించుకోలేకపోయారన్న ఆరోపణలను లోకేష్ తిప్పికొడుతూ , తాను తండ్రి చేసిన అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయలేదని టీడీపీ ఎప్పుడు గెలవని స్థానం నుంచి పోటీ చేశానని గుర్తు చేస్తూ పరోక్షంగా వైఎస్ గెల్చిన పులివెందుల నుంచి జగన్ గెలిచారంటూ లోకేష్ ఎద్దేవా చేశారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: