ఈ తరం పిల్లలు అర్ధరాత్రి వరకూ స్మార్ట్ ఫోన్స్ వాడుతుంటే తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం చాలా పెద్ద తప్పు అని ఇది చదివితే మీకే తెలుస్తుంది. వారి బిజీ లైఫ్ లో పడిపోయి తల్లిదండ్రులు అసలు తమ బిడ్డలు ఏం చేస్తున్నారో పట్టించుకోవట్లేదు. అలాంటి వారికే ఈ స్టోరీ. కేరళలో నివాసం ఉంటున్న స్వామి ఒక చిరు వ్యాపారి. అతనికి భార్య మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు పరమేశ్వరి కాలేజీలో టాపర్ కాగా అతని కొడుకు కిరణ్ స్కూల్ కి వెళుతున్నాడు. అయితే కాలేజీలో ఎప్పుడూ చదువులో ముందుంటే పరమేశ్వరి వర్మ అనే అతనితో ప్రేమలో పడింది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పగా వారు కూడా వారి ప్రేమను అర్థం చేసుకుని ఒప్పుకున్నారు.


అయితే ఇద్దరు లైఫ్ లో సెటిల్ అయిన తర్వాతే పెళ్లి అని తేల్చి చెప్పారు కూడా. అంతా సవ్యంగా జరుగుతుంది అని అనుకుంటున్న సమయంలో వారి జీవితం ఒక పెను మార్పుకి గురైంది. ఒక రోజు కాలేజీకి వెళుతూ కడుపు నొప్పి అని కూలబడ్డ పరమేశ్వరిని ఆమె తల్లి హాస్పిటల్ లో చేర్పించగా డాక్టర్ అన్నీ టెస్టులు చేసి ఆమె గర్భం దాల్చిందని చెప్పాడు. దీంతో కోపంతో ఊగిపోయిన తల్లి ఆమె చెంప చెల్లుమనిపించింది. ఫోన్లో విషయం తెలుసుకున్న స్వామి మరియు కిరణ్ హాస్పిటల్ కి వచ్చారు. తండ్రి కూడా ఆమెను కొడుతూ ఇంత పాపం ఎలా చేవుఅని అడుగగా అసలు దీనికి కారణం తన బాయ్ ఫ్రెండ్ వర్మ కాదని.. తాను ఎలా గర్భందాల్చినది తనకు తెలియదని ఆమె చెప్పింది.

 

వర్మ కూడా ఇదే విషయం చెప్పి వారి కూతురిని తాను ఎట్టి పరిస్థితిలో పెళ్లి చేసుకోను అని వెళ్ళిపోయాడు. ఒకపక్క పరమేశ్వరి బాధపడుతుండగా ఆమె తమ్ముడు కిరణ్ కళ్ళల్లో భయం చూసి పరమేశ్వరికి విషయం అర్థమైంది. వెంటనే హాస్పిటల్ నుండి పరిగెత్తుకొని వెళ్లి లారీ కింద పడి చనిపోయింది. నిదానంగా తల్లిదండ్రులు తెలుసుకున్న విషయం ఏమిటంటే కిరణ్ అర్ధరాత్రి వరకూ తన ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తూ తన అక్కకు పాల గ్లాసులో నిద్రమాత్రలు కలిపి లైంగిక దాడికి పాల్పడ్డాడు అని. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కిరణ్ పోలీసులకు అప్పగించారు కానీ అప్పటికే వారికి తమ బంగారు తల్లి దూరమైపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: