మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగులో జగన్ తప్పుగా మాట్లాడారని.. లెక్కల్లో వీక్‌గా ఉన్నారంటూ ఓ వీడియోను నారా లోకేష్ బయటపెట్టారు. తనను పప్పు.. పప్పు అంటున్నారని.. మరి జగన్‌ ను గన్నేరు పప్పు అంటారా అని సెటైర్లు పేల్చారు లోకేష్. వైసీపీ పేటీఎం బ్యాచ్, నేతలు ఈ వీడియోకు ఏం సమాధానం చెబుతారని వైసీపీ నేతలను ప్రశ్నించారు.


తాను(లోకేష్) శాసనసభలో సభ్యుడిని కాకపోయినా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తన పేరును పదే, పదే ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించారు. చంద్రబాబు కంటే తన పేరును పదే, పదే ప్రస్తావించారని శాసనసభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదన్న సంప్రదాయం కూడా తెలియదా అని.. అన్నారు.  నా పేరును పదే పదే ప్రస్తావించిన స్పీకర్ మాత్రం వారిని ఏమి అనలేదని అసలు ఇదేం పద్దతని అయన మండిపడ్డారు. తాను పై చదువుల కోసం అమెరికా వెళ్లానని దాదాపు ఎనిమిదేళ్లు అమెరికాలో ఉన్నానని తెలుగులో ఒక పదం అటో.. ఇటో అని ఉండొచ్చు అన్నారని లోకేష్ అన్నారు.

తాను తెలుగు తప్పుగా మాట్లాడటం వలన  ఏపీకి ఏదైనా అన్యాయం జరిగిందా అంటూ లోకేష్ ప్రశ్నించారు. ఏపీ లో పెట్టబడులు వెనక్కు వెళ్లాయా, పోలవరం పనులు ఆగాయా, అమరావతి ఏమైనా ఆగిందా అంటూ వైఎస్సార్‌ సీపీ చెప్పాలన్నారు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి.. 16 నెలలు జైల్లో ఉన్న ఆయన నీతులు మాట్లాడితే వినడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు.


ఐటీ మరియు  పంచాయతీ రాజ్ శాఖకు ఎంతో కష్టపడి పనిచేశానని లోకేష్ అన్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాలుగు శాఖలకు 53 అవార్డులు వచ్చాయన్నారు. రాష్ట్రానికి ఎన్నో నిధులు తీసుకొచ్చామని.. 25వేల కిలోమీటర్లు రోడ్లు వేశామని చెప్పారు. మరుగుదొడ్లు కట్టాం గ్రామాలు అభివృద్ధి చేశామని చెప్పారు. తాను  ఇక 2014 మహానాడులో కార్యకర్తల్ని ఆదుకోవాలనే లక్ష్యంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాను అన్నారు లోకేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: