మనదేశంలోనే దిశ అత్యాచార ఘటన ఆడవాళ్ళ అందరికీ ఒక మేలుకొలుపు లాంటిది. తర్వాత ఆమెను అతి కిరాతకంగా హింసించి చంపిన కారణంగా నలుగురు నిందితులను పోలీసు వారు ఎన్ కౌంటర్ చేసి మట్టుబెట్టిన తీరుపై సర్వత్రా విమర్శలు నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మహమ్మద్ ఆరీఫ్, చెన్నకేశవులు, శివ తదితరులు కలిసి హైదరాబాదులోని శంషాబాద్ దగ్గర అర్ధరాత్రి పూట చేసిన ఈ మదోన్మాద ఘటన వెనుక ఉన్న కొత్త నిందితులు ఇప్పుడు నిదానంగా బయటికి వస్తున్నారు.

 

నిజానికి ఆరోజు టోల్ గేటు దగ్గర దిశ స్కూటీని పంక్చర్ చేసిన నలుగురు ఒకరిని స్కూటీ పంక్చర్ వేసుకొని వచ్చేందుకు పంపించి డ్రామాలు ఆడారు. అయితే వారు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ చాలా సేపు ఉన్నారు. ఇదే సమయంలో దిశ తన చెల్లికి ఫోన్ చేసి తన స్కూటీకి ఇలా ప్రాబ్లం వచ్చింది అని... తనకు ఎందుకో కొంచెం భయంగా ఉందని తనతో ఫోన్లో మాట్లాడుతూ ఉండమని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తాను టోల్ గేటు వెలుగుల మధ్య ఉన్నంత వరకు ఆమె చాలా సురక్షితం గానే ఉంది. అవకాశం కోసం కాపు కాసిన నాలుగు క్రూరులు ఏం చేయలేక ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉన్నారు.

 

అదే సమయంలో టోల్ గేటు వద్ద ఉన్న రహదారి మీద వెళ్తున్న కుర్రకారు మరియు టీనేజర్లు, తాగుబోతులు ఆమె అలా ఒక్కటే రోడ్డు పక్కన నిలబడి ఉండడం చూసి ఆమె మీద కామెంట్లు చేయడం మరియు కించపరిచేలా సూటిపోటి మాటలు మాట్లాడడంతో ఆమె చాలా సిగ్గు గా ఫీల్ అయింది. అటువంటి రాత్రి సమయంలో ఒక ఆడపిల్ల రహదారిపై అలా ఒంటరిగా ఉంటే మగవాళ్ళ చెత్త ఆలోచనలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అందుకే వాళ్ల సూటిపోటి కామెంట్స్ నుండి తప్పించుకునేందుకు ఆమె అక్కడి నుండి ఎవరికీ కనపడకుండా కొంచెం చీకట్లో ఇంటికి వెళ్లగా నలుగురు నిందితులు ఆమెపై ఈ దారుణానికి ఒడిగట్టారు. ఇక ఆ నలుగురిని ఎన్ కౌంటర్ చేసిన పోలీసు వారు ఆమెకు ఇలా జరిగేందుకు తోడ్పడిన మిగిలిన వారిని ఏం చేస్తారో....

మరింత సమాచారం తెలుసుకోండి: