సమాజంలో కీచకులు ప్రతీ చోటా అమాయకమైన ఆడవాళ్ళకోసం కాచుకొని కూర్చుంటున్నారు. ఎప్పుడు అవకాశం దొరికితే వారిపై కామంతో రగిలిపోదామా అని నక్క వినయాలతో రెడీ అవుతున్నారు. తాజా అలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని ఓ గ్రామంలో మహిళపై గ్రామ వాలంటీర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రైతు భరోసా పథకానికి సంబంధించి ఆధార్‌, బ్యాంకు ఖాతా పుస్తకం, పొలం పట్టా నకలు ప్రతులు తేవాలని కలిగిరి మండలానికి చెందిన ఓ గ్రామ వాలంటీర్ సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో మహిళకు ఫోన్ చేసి చెప్పాడు.

 

దీంతో రాత్రివేళ ఒంటరిగా వాలంటీర్ ఇంటికి వెళ్లిన మహిళ వాలంటీర్ అడిగిన పత్రాలన్నీ సమర్పించిన తర్వాత అతడికి కొన్ని వివరాలు చెప్పి ఆ మహిళ ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో మహిళ చేయి పట్టుకుని గదిలోక లాగిన వాలంటీర్ తలుపులు మూసేసి ఆమెపై అత్యాచారం చేయబోయాడు. తన కోరిక తీరిస్తే ప్రభుత్వం పరంగా అందే అన్ని పనులు చేసి పెడతానని మహిళను ప్రలోభపెట్టాడు. అతని మాయమాటలకు లొంగకుండా తీవ్రంగా వారించిన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో భయపడి ఆమెను వదిలేశాడు.

 

దీంతో బాధితురాలు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది. భర్త వ్యక్తిగత పనుల నిమిత్తం చెన్నైకి వెళ్లడంతో ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో మంగళవారం ఉదయానికి ఇంటికి చేరుకున్న అతడు భార్యతో కలిసి కలిగిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ ఆదిలక్ష్మి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి సంఘటన్లు రోజుకు లెక్కకు మించి జరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు వచ్చిన ఎలాంటి శిక్షలు విధించినా కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్న మృగాలు మాత్రం మారడం లేదు. ఈ మధ్యనే జరిగిన దిశ సంఘటన మరవకముందే ప్రతీ రోజు ఇలాంటి సంఘటనలు అమాయకమైన అమ్మాయిల మీద మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టే మార్గమే కనిపించడం లేదు.  
  

మరింత సమాచారం తెలుసుకోండి: