మొత్తం దేశాన్ని కుదిపేసిన దిశ హత్యాచార ఘటనకు సంబంధించి ఎంతో మంది ప్రముఖులు మరియు సాధారణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేయగా ఆ నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విధానం పలువురి ప్రశంసలు అందుకుంది. అయితే ఈ ఎన్ కౌంటర్ పై ఒక నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఒక కమిటీని ఆదేశించగా ఇదే విషయమై కమీషనర్ సజ్జనార్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఇకపోతే నిన్నటి నుండి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అది కూడా హైదరాబాద్ లోని శంషాబాద్ టోల్ గేట్ ప్లాజా దగ్గర జరిగిన రేప్ కు సంబంధించినది కావడం విశేషం.


పోలీసులు అసలు ఈ ఘటన ఎలా జరిగింది మరియు రానున్న రోజుల్లో ఇటువంటివి జరగకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో టోల్ గేట్ వద్ద సిసి టి.వి ని పరిశీలిస్తుండగా వారికి ఒక వీడియో అనూహ్యంగా లభించింది. సోమవారం సిసి టీవీలో పోలీసు వారు తీక్షణంగా చూస్తూ ఉండగా అందులో ఒక లారీ వారికి అనుమానస్పదంగా తిరుగుతూ కనిపించింది. పోలీసులు అదే లారీ లో హైదరాబాద్ కు చెందిన వెటర్నరీ డాక్టర్ ను తరలించినట్లు గుర్తు చేశారు. టోల్ గేట్ వద్ద ఖాళీ స్థలం నుండి తీసుకొని వస్తున్న లారీ సి.సి టీవి కెమెరాకు చిక్కింది.

 

మనం ఆ సీసీటీవీ ఫుటేజ్ లో చిన్నగా ఒక లారీ ట్రక్కు టోల్ ప్లాజా నుండి హైవే వైపుకి కదలడం చూడవచ్చు. ఇదిలా ఉండగా సోమవారం ఒక ఎన్జీవో అధికారి రాచకొండ పోలీస్ వారికి సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ పైన మర్డర్ కేసు నమోదు చేయాలని ఒక కంప్లైంట్ రాశారు. దిశ హత్యకేసులో నిందితులను చేసిన ఎన్ కౌంటర్ నకిలీదని... వారు కేవలం కథను అళ్లి మరీ నలుగురి మట్టుపెట్టారని 'నేను సైతం' అనబడే ఈ ఎన్జీవో అధికారి రాయడం గమనార్హం. అనేకానేక మలుపులు తిరుగుతున్న ఈ కేసు చివరికి ఎలా ముగుస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: