ఏపీ అసెంబ్లీలో  చర్చల సందర్భంగ రాయలసీమలో ప్రాజెక్ట్‌లపై వాడీ-వేడి చర్చ జరిగింది. అధికార-విపక్షాల మాటలు తీవ్ర విమర్శలు కి దిగారు ..కొత్త ప్రభుత్వ తీరుతో  వరదలు అన్ని వచ్చిన సాగునీటిని నిల్వ చేయలేకపోయారని టీడీఎల్పీ ఉపనేత రామానాయుడు ఆరోపించారు. వరదలు వస్తే ప్రాజెక్టులు నింపకుండా ప్రతిపక్ష నేత ఇల్లు ఎలా ముంచాలనే ఆలోచన చేశారని చంద్రబాబు వైఫల్యంతోనే రాయలసీమకు కరువు వచ్చిందని టీడీఎల్పీ  మరో ఉపనేత అచ్చెన్నాయుడు అంటూ  మాట్లాడారు .

 

దీనిపై వెంటనే  మంత్రి అనిల్‌కుమార్, వైఎస్సార్‌సీ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇచ్చారు. తర్వాత ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ అంశంపై మాట్లాడారు .చంద్రబాబు వైఫల్యంతోనే రాయలసీమకు కరువు వచ్చిందని.. చంద్రబాబు సరిగ్గా చేసి ఉంటే సీమకు పూర్తి స్థాయిలో నీళ్లు ఇచ్చే వాళ్లం అన్నారు టీడీపీ ఐదేళ్ల పాలనలో ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేశారని.. కాలువలకు మరమ్మత్తులు కూడా చేయలేకపోయారని మండిపడ్డారు సీఎం జగన్.

 

గండికోట ప్రాజెక్ట్‌కు రూ.980 కోట్లు విడుదల చేసి ఉంటే పూర్తి స్థాయిలో నిల్వ చేసి ఉండేవాళ్లమని తెలిపారు. కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీ పెంచ‌క‌పోవ‌డంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.చంద్రబాబు నిజంగా మనిషేనా అనిపిస్తోంది అంటూ మండిపడ్డారు. సీఎం. కెనాల్ కెపాసిటీ సరిగ్గా లేకపోవడం వల్లే ఈ దుస్థితి  వచ్చిందని.. గత ప్రభుత్వం గండికోటపై కేవలం రూ.190కోట్లు ఖర్చు చేసిందని.. కెనాల్ కెపాసిటీ సరిగ్గా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి అన్నారు. గండికోటలో 25 టీఎంసీలకు.. 12 టీఎంసీలే నిల్వ చేశామన్నారు.

 


వీటికి సంబంధించి నెల రోజుల్లో టెండర్లకు వెళ్లబోతున్నామని.. ప్రాజెక్టుల ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయబోతున్నామని సీఎం తెలిపారు. పెండింగ్ బిల్లులన్నీ చెల్లించేందుకు కృషి చేస్తున్నామని.. జూన్ నాటికి అన్ని ప్రాజెక్టులు నింపడానికి చర్యలు చేపట్టామని.. క‌నీసం 50 రోజులు వ‌ర్షాలు కురిసినా ప్రాజెక్టులు నింపాల‌ని ఇంజినీర్ల ఆధ్వ‌ర్యంలో వ్యూహ ర‌చ‌న చేస్తున్నామని చెప్పారు. దివంగత నేత, ప్రియతమ నాయకుడు కలలుగన్న రాయలసీమగా ప్రాజెక్టులన్నీ నీళ్లతో కళకళలాడే పరిస్థితులు వస్తాయన్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: