సినిమాల్లో చూపించే మంచి ఎంత వరకు ఫాలో అవుతారోకాని చెడును మాత్రం ప్రజలు స్వప్రయోజనాల కోసం వాడు కుంటున్నారు ‘ ప్రియురాలితో కలిసి భార్యను దారుణంగా చంపేసి..దృశ్యం’. సినిమా లోలాగా తప్పించుకు నేప్రయత్నం చేసాడు ..ఈ సినిమానే స్ఫూర్తిగా తీసుకున్న కేరళకు చెందిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను ప్రియురాలి సాయంతో చంపేశాడు. పోలీసులనుతప్పు దారి పట్టించేందుకు చేసేందుకు శవాన్ని తమిళనాడులో పూడ్చిపెట్టి, ఆమె సెల్ఫోన్ బీహార్ వెళ్లే రైలులో పడేశాడు.
కేరళలోని ఎన్నాకుళం ప్రాంతానికి చెందిన ప్రేమ్కుమార్, విద్య భార్యాభర్తలు. వీరి కాపురం ఎంతో అన్యోనంగా సాగిపోయేది. అయితే కొద్ది నెలల క్రితం గెట్ తో గెదర్ కార్యక్రమంలో భాగంగా ప్రేమ్ తన స్కూల్ ఫ్రెండ్స్ని కలిశాడు. వారిలో సునీత అనే మహిళతో అతడికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకుని తరుచూ ఛాట్ చేసుకునేవారు. క్రమంగా ఇద్దరి మధ్య స్నేహ బంధం కాస్త అక్రమ సంబంధంగ మారింది .
ఈ విషయం తెలుసుకున్న విద్య భర్తను నిలదీయడంతో అప్పటి నుండి ఇద్దరి మధ్య సంఘర్షణలు జరుగుతూనే ఉన్నాయ్ దీంతో తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్న విద్యను చంపేయాలని ప్రేమ్కుమార్, సునీత నిర్ణయించుకున్నారు. ప్లాన్ ప్రకారం ప్రేమ్కుమార్ తేదీన భార్యను తిరువనంతపురంలోని ఓ విల్లాకు తీసుకెళ్లాడు. అదే పట్టణంలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న సునీత కూడా అక్కడికి వచ్చింది . అర్ధరాత్రి సమయంలో ప్రేమ్ సునీత లు ఇద్దరు కలసి విద్య గొంతు నులిమి చంపేశారు.
తరువాత ఆమె మృతదేహాన్ని తమిళనాడులోని వల్లియూర్ పోలీస్స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారిపై పక్కన పూడ్చేశాడు. ఆమె సెల్ఫోన్ బీహార్ వెళ్లే రైలులో పడేశాడు. ఏమీ తెలియనట్లుగా ఉదయంపెరూర్ పోలీస్స్టేషన్కు వెళ్లి భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినా ఎలాంటి ఫలితంలేదు . ఇంతలో ప్రేమ్కుమార్ తన ప్రియురాలితో తిరునల్వేలిలో కాపురం పెట్టాడు.పోలీసులు విద్య మొబైల్ నంబర్ను ట్రేస్ చేయగా ఇటీవల ఫోన్ బీహార్లో దొరికింది.
ఈలోగా ఇటీవల కురిసిన వర్షాలకు వల్లియూర్ సమీపంలో ఓ గుర్తుతెలియని మహిళ శవం బయటపడింది. కేరళ పోలీసులు అక్కడికి వెళ్లి ఆ డెడ్బాబీ విద్యదేనని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టడంతో అనేక విషయాలు బయటపడ్డాయి. ప్రేమ్కుమార్, సునీతను అదుపులోకి తీసుకుని విచారించగా వారిద్దరూ నేరం అంగీకరించారు. తమ అక్రమ సంబంధానికి అడ్డు పడుతున్నందునే తాము విద్యను హత్యచేసినట్లు ఒప్పుకోవడంతో కటకటాల్లోకి పంపించారు.