నగరానికి ఎక్కడెక్కడి నుండో బ్రతుకు దెరువు కోసం పిల్లా పాపలతో వస్తారు. వచ్చిన వారు బుద్ధిగా ఉండి పని చేసుకుంటూ జీవనాన్ని సాగించరు. ఇక్కడ చెడు వ్యసనాలకు బానిసలై తమ సంసారాన్ని సర్వ నాశనం చేసుకుంటారు. పది మందిలో పరువు పోడ గొట్టుకోవడమే కాకుండా ఒక్కోసారి వారికి వచ్చే ఆవేశంలో విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో కూడ గ్రహించకుండా రాక్షసుల్లా మారుతారు. ఇకపోతే క్షణికమైన ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఓ కుటుంబం నామారూపాలు లేకుండా పోయింది.

 

 

నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో జరిగిన ఈ ఘోరమైన ఘటన వివరాలు తెలుసుకుంటే. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోపన్‌పల్లి ఎన్‌టీఆర్ నగర్‌లో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను, కన్న కొడుకు (2) ని దారుణంగా నరికి చంపేశాడు. కొద్దినెలల క్రితం కర్ణాటకలోని హుబ్లీ ప్రాంతానికి చెందిన అనంతప్ప భార్య, మాధవి, కుమారుడితో కలిసి హైదరాబాద్‌కు వలస వచ్చాడు. ఈ క్రమంలో కుటుంబాన్ని పోషించడానికి గచ్చిబౌలి ప్రాంతంలోని గోపన్‌పల్లిలో ఉంటూ చిన్నాచితక పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

 

 

అయితే బుధవారం దంపతుల మధ్య గొడవ జరగడంతో అనంతప్ప ఆగ్రహంతో రెచ్చిపో భార్యతో పాటు రెండేళ్ల కుమారుడిని కత్తితో నరికి చంపేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనపై స్థానికులు సమాచారం ఇవ్వడంతో గచ్చిబౌలి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న అనంతప్ప ఆస్పత్రికి తరలించారు..

 

 

అయితే ప్రస్తుతం అనంతప్ప పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలతోనే అనంతప్ప ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. ఇకపోతే క్షణికావేశంతో అనంతప్ప భార్య, బిడ్డ ప్రాణం తీయడంతో స్థానికంగా విషాదం నెలకొంది. మనిషి పశువుగా మారుతాడు అనే సామేత ఈ ఘటనతో మరో సారి రుజువైంది అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: