ఒకానొక సమయంలో,ఆధ్యాపకుడిగా విద్యార్థులకు పాఠాలు నేర్పించి చిన  కడియం శ్రీహరి తిరిగి ఇటీవల ఇంటర్‌ విద్యార్థులకు పాఠాలు భోదించి ఆధ్యాపకుడి అవతారమెత్తాడు.ఈఘటన మండల కేంద్రంలోని మోడల్‌ కళాశాలలో చోటు చేసుకోవడం జరిగినది. మంగళవారం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ మోడల్‌ కాలేజీతో పాటు కస్తూర్బా పాఠశాలను కూడా కడియం శ్రీహరి గారు ఆకస్మికంగా సందర్శించడం జరిగినది. తొలుత మోడల్‌ స్కూల్‌ను సందర్శించిన కడియం శ్రీహరి తరగతి గదిలో ఉన్న విద్యార్థులను చూడగానే నేరుగా తరగతి రూంలోకి వెళ్లి విద్యార్థులకు పాఠం చెప్పడముతో విద్యార్థులు ఒకింత ఆశ్చర్యపోయారు. పాఠ్య బోధన చెయ్యడమే కాకుండా విద్యార్థులను పలు ప్రశ్నలు అడగడం జరిగింది.

 

లోక్‌సభ, రాజ్యసభలో సభ్యుల సంఖ్యతో పాటు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఎవరంటూ ప్రశ్నించారు. ఎంతైనా రాజకీయ నాయకులు కాబట్టి రాజకీయము గురించే అడగడం విశేషము.వీటికి  సమాధానం చెప్పిన సుస్మిత అనే విద్యార్థినిని అభినందించారు. తర్వాత సుష్మిత కు వెయ్యి రూపాయల పారితోషికాన్ని కూడా అందించారు.  తర్వాత విద్యార్థులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులను ,పాఠశాలలో నెలకొన్న సమస్యలను వివరంగా  అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన సమస్యలను మంత్రి కడియం శ్రీహరి గారు వెంటనే స్పందించడం జరిగింది.

 

అక్కడి నుంచే మోడల్‌ స్కూల్‌ డైరెక్టర్‌ సత్యనారాయణరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి మాడల్ స్కూల్ లో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కడియం శ్రీహరి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాలలో నెలకొన్న సమస్యలన్నింటినీ రెండు నెలల్లో పరిష్కరిస్తానని హామీ కూడా ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బత్తిని రాజేందర్, , డీఈ జెయాకర్ గారు, పాఠశాలల ప్రిన్సిపాళ్లు శ్రీకాంత్, సీహెచ్‌.స్వప్న, సర్పంచ్‌ నర్సింగరావు, పాఠశాలవిద్యాకమిటీ చైర్మన్‌ జయశంకర్, టీఆర్‌ఎస్‌ నాయకులు బానోత్‌ రాజేష్‌నాయక్, అన్నం శ్రీ బ్రహ్మారెడ్డి, ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటస్వామి గారు, నాయకులు కుల్లా మోహన్‌రావు, మారపల్లి ప్రభాకర్ గార్లు, కుల్లా నర్సింగంతో పాటు ఆయా గ్రామాలకు చెందిన టు వంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడడం జరిగినది.

మరింత సమాచారం తెలుసుకోండి: