ఎంపీ రఘురామ కృష్ణంరాజు సబార్డినేట్‌ లెజిస్లేచర్‌ కమిటీ అధ్యక్షుడి హోదాలో జనపథ్‌, లాన్స్‌ ఆఫ్‌ వెస్టర్న్‌ కోర్టులో బుధవారం రాత్రి ఆయన  ఢిల్లీలో ఎంపీలకు విందు ఇచ్చారు. ఈ విందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా పలువురు ఎంపీలు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ ఎంపీలు కూడా  ఈ విందులో పాల్గొన్నారు. విందుకు హాజరైన ఎంపీలను ఆయన ఆత్మీయంగా ఆహ్వానించారు. కాగా 2019 లోక్ సభ ఎన్నికల్లో congress PARTY' target='_blank' title='వైస్సార్సీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైస్సార్సీపీ పార్టీ నుండి నర్సాపురం ఎంపీ గెలిచిన విషయం తెలిసిందే. 

 

పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా చాలా మంది ఎంపీలు గతంలో పార్టీలు ఇచ్చారు. ఈ శీతాకాల సమావేశాల ముగింపు సందర్భంగా తాను పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. సబార్డినేట్ కమిటీ చైర్మన్‌గా ఎన్నిక కావడం కూడా విందు ఇవ్వడానికి ఓ కారణమన్నారు. ఈ విందుకోసం 500 మంది ఎంపీలను ఆహ్వానించానని రఘురామ కృష్ణం రాజు తెలిపారు. 300 మంది వస్తానని తనతో చెప్పారన్నారు. ఈ విందులో ఆంధ్ర వంటకాలను ఎంపీలకు రాజు గారు రుచి చూపించారు.
 
తాను విందు నిర్వహించే విషయమై.. వైఎస్సార్సీపీకి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కానీ తాను ముందుగా తమ పార్టీకి చెందిన ఎంపీలనే పిలిచానన్నారు. చిన్న చిన్న పార్టీలకు చెందిన ఎంపీలను సైతం తాను విందుకు ఆహ్వానించానని చెప్పారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఈ విందు ఇచ్చినట్టు ఆయన చెప్పారు. తనకు, జగన్‌కు మధ్య దూరం పెంచడానికి తమ పార్టీకే చెందిన ఒకరిద్దరు ఎంపీలు ప్రయత్నిస్తున్నారని  అన్నారు. తనపై పార్టీ అధినేతకు ఉన్నవీ లేనివీ కల్పించి చెబుతున్నారని ఆరోపించారు. వారి పేర్లు తను బయటపెట్టనని చెప్పిన ఆయన.. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు.
 
కేంద్రంలో ఉన్న పెద్దలకు దగ్గర కావడానికి అందరికీ విందు ఇవ్వాల్సిన అవసరం లేదని, దగ్గర కావాలంటే వాళ్లను మాత్రమే పిలిచి విందు ఇస్తాను కదా అని ఆయన చెప్పారు. నేను అందరితోనూ సఖ్యతగానే ఉంటానన్నారు. తాను బీజేపీలోకి వెళ్తానని వస్తోన్న వార్తలను రఘురామ కృష్ణంరాజు ఖండించారు. ఏపీలో చాలా సినిమా ఫంక్షన్లు, రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తల డిన్నర్ పార్టీలకు తాను హాజరు అవుతానని చెప్పారు. అప్పుడు రాజకీయాల్లో లేను కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎంపీ కాబట్టి ఎక్కువ మంది పట్టించుకుంటున్నారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: