మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మూడవ స్థానంలో ఉంది. ఎన్నికల వాచ్డాగ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) ప్రకారం వైయస్ఆర్సికి ఎన్నికైన 7 ప్రతినిధులు ఉన్నారు. ఈ జాబితాలో బిజెపి మొదటి స్థానంలో 21, కాంగ్రెస్ 16 తో ఉన్నాయి. ఆడవాళ్ళ పై నేరాలు చేసిన కేసులతో సంబంధం ఉన్న లోక్ సభ సభ్యుల సంఖ్య 2009 లో రెండు ఉండగా అది 2019 లో 19 కి పెరిగింది.
వైఎస్ఆర్సికి చెందిన ముగ్గురు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధాన ఎపి ప్రతిపక్ష పార్టీ, తెలుగు దేశంలో ఒక ఎమ్మెల్యే అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పాలక తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) లో ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కుంటున్నారు. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు సమర్పించిన అఫిడవిట్ల విశ్లేషణ ఆధారంగా ఎడిఆర్ ఈ డేటా రూపొందించబడింది.
మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులతో తొమ్మిది మంది అభ్యర్థులను వైఎస్ఆర్సి నిలబెట్టింది. హిందూపూర్ వైయస్ఆర్సి ఎంపి కురువ గోరంట్ల మాధవ్ ఒక అత్యాచారం, రెండు క్రిమినల్ బెదిరింపు ఆరోపణలు మరియు హత్యకు సంబంధించిన మరో అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు. వైఎస్ఆర్సి రాజమండ్రి ఎంపి మార్గని భారత్ తన భార్యపై క్రూరత్వానికి పాల్పడ్డాడు అని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అతనిపై కట్నం నిషేధ చట్టం మరియు గృహ హింస చట్టం, 2005 కింద కేసు నమోదైంది.
విజయ నగరం ఎంపి బెల్లానా చంద్రశేఖర్, వైయస్ఆర్సి యొక్క ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్-రామి రెడ్డి , వైయస్ఆర్సి యొక్క మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెడ్డా రెడ్డి మరియు తంబలపల్లె ఎమ్మెల్యే పెడిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి కూడా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
తెలుగుదేశం నుండి ఎమ్మెల్యే కరణం బలరామ్, టి ఆర్ యస్ నుండి ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే బనోత్ శంకర్, నల్గొండ ఎమ్మెల్యే కాంచార్ల భూపాల్ రెడ్డి కూడా ఆరోపణలను ఎదుర్కుంటున్నారు.