అత్యాచారం ఇప్పుడు ఈ పదం వింటే చాలు షాద్ నగర్ వెటర్నరీ వైద్యురాలు దిశ కేసు ఏ గుర్తస్తుంది. అంత అమానవీయంగా జరిగింది ఆ ఘటన. పని ఉండి బయటకు వెళ్లిన ఆ అమ్మాయిని నలుగురు లారీ డ్రైవర్లు కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి పెట్రోల్ పోసి ఆమె శవాన్ని ముట్టుకొనేకి కూడా లేకుండా పెట్రోల్ పోసి కాల్చిపడేశారు ఆ నీచులు. 

 

అయితే ఆ నీచులు కూడా సిన్ రికర్రెక్షన్ చేస్తున్న సమయంలో ఆ నిందితులు పారిపోవాలని చూసి పోలీసులపై దాడి చెయ్యడం వల్ల పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నిందితులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ నిందితులు నలుగురు ఈ నెల 6వ తేదీన కుక్క చావు చచ్చారు. దీంతో మరో ఆడపిల్లపై ఎవరైనా అత్యాచారం చెయ్యాలంటే బయపడుతారు అంటూ దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. 

 

అయితే ఈ ఎన్కౌంటర్ పై ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగా సంచలన నిజాలు బయట పడ్డాయి. ఆ నిజాలు ఏంటంటే.. నిందితులు ఎవరైతే నలుగురు ఉన్నారో.. వారు అంతకముందు రోజు నుండి ఫుల్ గా మద్యం, మాంసం తిన్నట్టు.. అందుకే వారి శరీరంలో రజో గుణం పెరిగి అత్యాచారం చేసినట్టు సమాచారం. 

 

అయితే ఇలా మాంసం తింటే రజో గుణం పెరుగుతుంది అని.. మాంసం అమ్ముడు పోవాలని బయట కొందరు కొన్ని కెమికల్స్ వాడుతారు అని ఆ కెమికల్స్ వల్లే రజో గుణం పెరిగి ఇలా కనిపించిన అమ్మాయిపై అత్యాచారం చేసి.. అమ్మాయి బతికి ఉందా లేదా అని కూడా చూడకుండా పాశవికంగా ప్రవర్తిస్తారని ఓ వైద్య నిపుణుడు కూడా చెప్పాడు. 

 

కాగా ఈ దిశ కేసులో నిందితులు అరెస్ట్ అయినా రెండో రోజే.. ఉదయం నుండి తగినట్టు ఏమి తోచకనే అలా అమ్మాయి ఒంటరిగా కనిపించేసరికి అత్యాచారం చేసినట్టు నిజం ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఈ నిజాలు మరోసారి బయటకు వచ్చేసరికి సంచలనం సృష్టిస్తున్నాయి. మరి నిజంగా చికెన్, మటన్ తినటం వల్ల అత్యాచారాలు జరుగుతాయా ?

మరింత సమాచారం తెలుసుకోండి: