దిశ.. ఈ పేరు గురించి దేశవ్యాప్తంగా తెలుసు. ఎందుకంటే ఆమె ఘటన ఒక దారుణం. వెటర్నరీ వైద్యురాలైన దిశను అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి ఆపై ఆమెను సజీవదహనం చేశారు నలుగురు నిందితులు. కనీసం ఆమె శరీరాన్ని ముట్టుకోను కూడా ముట్టుకోనివ్వకుండా చంపేశారు ఆ నీచులు. 

 

దీంతో యావత్ దేశం ఒక్కసారిగా కోపాన్ని పీకల మీదకు తెచ్చుకుంది. ఆ నిందితులను పోలీసులు గుర్తించి అరెస్ట్ చెయ్యగానే.. ప్రజలంతా ఒక్కసారిగా వచ్చి ఆ నీచులను మాకు అప్పగించండి మేము చంపేస్తాం అంటూ కామెంట్లు చేశారు. దీంతో పోలీసులు ఆ నీచులను కేసు రేకంస్ట్రక్షన్ అంటూ ఘటన స్థలానికి తీసుకురాగా.. 

 

ఆ నీచులు పారిపోవడానికి ప్రయత్నించి పోలీసులపైనే దాడికి దిగారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నీచులపై ఎన్కౌంటర్ జరిపి చంపేశారు. దీంతో ఆ నీచులు అక్కడే చచ్చారు.. వాళ్ళు చావడంతో ఆగ్రహంతో ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కాస్త శాంతించారు. అయితే దేశం అంత శాంతంగా ఉన్న.. ఆ నలుగురు నిందితుల ఇళ్లలో మాత్రం తీవ్ర విషాదం నెలకొంది. 

 

అయితే ఈ విషాదంతో ఆ నలుగురు నిందితుల కుటుంబంలో ఒకరైన చెన్నకేసువులు భార్య రేణుక అనే ఆమె భర్త పోతే పోయాడు.. నాకు ఓ పది లక్షల ఇల్లు.. డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అయినా ఇప్పియండి మాకు న్యాయం చెయ్యండి అంటూ యూట్యూబ్ ఛానెల్స్ ముందు గోలగోల చేసింది. దీంతో ఆ వార్తలు రెండు రోజులు హల్ చల్ చేసాయి. 

 

అయితే ఆమె భర్త ఏదో దేశం కోసం చచ్చినట్టు ఆమె నష్టపరిహారం అడిగింది.. నిజానికి ఆ నలుగురు నిందితుల కుటుంబాలు పేద కుటుంబాలే.. కానీ ఆ కుటుంబంలో పుట్టినందుకు కష్టపడి తల్లిదండ్రులను ఆనందగా చేసుకోవాల్సింది పోయి ఒక ఆడపిల్లను అమానుషంగా చంపారు.. అలాంటి నీచుల కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తే.. దిశ కేసులో నిందితుల్లాంటి నింధితులు దేశంలో ఎంతమంది పుట్టుకొస్తారు.. అందుకే ఆ నీచ నిందితుల కుటుంబాలకు నష్టపరిహారం, ఆర్థికసాయం చేయకపోతేనే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: