వైసీపీ సర్కారులో కేవలం ఒక్క కులానికే అన్నీ కట్టబెడుతున్నారన్న ఆరోపణలు ప్రతిపక్షం చేస్తోంది. గతంలో చంద్రబాబు హయాంలోనూ ఒకే కులానికి ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. అయితే వైసీపీలో కేవలం ఒక్క కులానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణల్లో నిజం లేదంటున్నారు వైసీపీ నేతలు.

 

నవరత్నాలు ఏ వర్గానికి, ఏ కులానికి ఉద్దేశించినవి కాదని, ఒక కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఒక మెట్టు పైకి తీసుకువచ్చేందుకు ప్రవేశపెట్టినవి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు వివరించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఆంధ్రరాష్ట్ర చరిత్ర తిరగరాయబడుతుందన్నారు. రెండు నెలల్లో ఉద్యోగాల విప్లవం తీసుకువచ్చారని, ఇదే పేదరికంపై గెలుపు అప్పలరాజు అన్నారు.

 

అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 1.40 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగులు, 2.60 లక్షల మందికి వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు విప్లవం తీసుకువచ్చారన్నారు. ఇదే పేదరికంపై గెలుపు అన్నారు. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి యువ మోసం ద్వారా నిరుద్యోగ భృతి రూ. 2 వేలు ఇస్తానని చెప్పి ఎన్నికలకు నాలుగు నెలల ముందు రూ.2వేల భృతిని రూ. వెయ్యి చేశాడని, ఇంటికో ఉద్యోగం అంటే కోటి 40 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిన స్థానంలో కనీసం 4 లక్షల మందికి కూడా చంద్రబాబు భృతి ఇవ్వలేక దగా చేశాడన్నారు. ఆ మోసం పథకం నుంచి బయటపడి నాలుగు లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దన్నారు.

 

గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు 500 సేవలు అందుతున్నాయి. అందులో 47 సేవలు కేవలం 15 నిమిషాల్లో తీర్చేయగలిగేవి. అదే విధంగా 148 రకాల సేవలను మూడు రోజుల్లో పరిష్కరించేవి.. మిగిలినవి 5 రోజుల్లో పరిష్కరించేవి ఉన్నాయన్నారు. పంచాయతీ ఆస్తులు సంరక్షించడం, ఆహారం కల్తీ, తూకాల్లో మోసం, బాల కార్మిక వ్యవస్థ, గృహ హింస, బాల్య వివాహం వంటివి నియంత్రించడం, మద్యపాన నిషేధం, స్పందన వినతులు పరిష్కరించడం, పంచాయతీ పన్నులు వసూలు చేసి పునరావాస కేంద్రాలు నిర్వహించడం, జనన మరణాలు వెంటనే నమోదు, ధ్రువపత్రాల జారీ, ఎరువులు, విత్తనాలు సరఫరా, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించడం, నూతనంగా తీసుకొచ్చే మహిళా భద్రత చట్టాన్ని గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అమలు చేయనున్నామని అప్పలరాజు అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: