ఇంతవరకు వినని వార్త. కంప్యూటర్ కాలంలో ఉంటూనే ఇలాంటి న్యూస్ ఏంటని అనుకుంటాం. కాని మనకు తెలియని శక్తి ఏదో ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుందనే విషయాన్ని ఇప్పటికే చాలామంది ఒప్పుకున్నారు. ఇక పరిశోధకులు కూడా ఈ విషయం పై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికి ప్రపంచంలో ఎన్నో నమ్మలేని నిజాలు, భయంకరమైన రహస్యాలు మనకు ఉన్నాయనే విషయం ఒకసారి చరిత్రను పరిశీలిస్తే అర్ధం అవుతుంది.

 

 

ఇకపోతే దైవం అనేది హిందువుల మనసుల్లో ప్రగాఢంగా నాటుకు పోయిన నమ్మకం. అందుకే లోకంలో పూజలు ప్రతి మందిరాల్లో పద్దతిగా నిర్వహిస్తారు. ఇకపోతే ఒక చోట ఉన్న దేవుని గుడిలో నుండి ఆ గుడిలో ఉన్న దేవతల మాటలు వినిపిస్తున్నాయట. ఇదెక్కడ జరుగుతుందో తెలుసుకుంటే బీహార్‌లోని, బస్తర్‌లో ఉన్న 400 ఏళ్ల నాటీ ఆలయమైన రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి ఆలయం. ఇప్పుడు మేధావులకు సవాల్ విసురుతుందట.

 

 

ఇక్కడ చీకటి పడితే చాలు మాటలు వినిపిస్తుంటాయట. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు.. ప్రతి రోజు. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకొనేందుకు గ్రామస్తులు చాలాసార్లు ప్రయత్నించారట. చివరికి గుడి నుంచి వస్తున్నాయని తెలుసుకుని లోపలికి వెళ్లి చూశారట. కానీ, ఎవరూ లేరు. మాటలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. చివరికి ఆలయంలోని గర్భగుడిలో ఉండే విగ్రహాల నుంచి వస్తున్నట్లు తెలుసుకున్నారట.

 

 

ఈ విషయం పరిశోధకులకు సైతం తెలిసింది.  ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోడానికి రంగంలోకి దిగారు. మనుషులు లేకుండా మాటలు వినిపించడం చూసి ఆశ్చర్యపోయారు. ఇకపోతే ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ, ఫలితం దక్కలేదు. అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా ఈ మిస్టరీని తెలుసుకోవడం లో విఫలమయ్యారంటే.. అది నిజంగా చిత్రమే.

 

 

ఇప్పుడే కాదు.. కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, చిన్న ఆధారం కూడా దొరకలేదట. ఒక రకంగా ఇది ప్రపంచం లో జరిగే వింతే కదా మరి మీకు తెలుసుకోవాలని ఉంటే ఈ ప్రదేశానికి వెళ్లి పరిశీలించుకోండని ఈ విషయం తెలిసిన వారు చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: