మ‌న దేశంలో సౌత్ టు నార్త్ తేడా లేకుండా అత్యాచారాల‌కు అంతే లేకుండా పోతోంది. ఎన్ని చ‌ట్టాలు వ‌చ్చినా, ఎన్ని ఎన్ కౌంట‌ర్లు జ‌రిగినా ఈ రేప్‌లు, హ‌త్య‌లు, వివాహేతర సంబంధాలు మాత్రం ఆగ‌డం లేదు. ఇక ముస్లింల విష‌యంలో కూడా జ‌ర‌గాల్సిన దారుణాలు జ‌రుగుతూనే ఉన్నాయి. త్రిపుల్ తలాఖ్ పేరుతో ఇంకా ఆటవిక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. త్రిపుల్ తలాఖ్‌పై చట్టం వచ్చినా కూడా.. ఇంకా ముస్లిం మహిళలకు అన్యాయం జరుగుతూనే ఉంది.

 

మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో చోటుచేసుకున్న ఓ ఘటన.. ఇప్పుడు సంచలనంగా మారింది. భోపాల్ న‌గ‌రంలో ఓ కుటుంబంలో భార్య‌, భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు వ‌చ్చాయి. అయితే ఈ త‌గాదాల నేప‌థ్యంలో స‌ద‌రు భ‌ర్త భార్య‌కు త్రిపుల్ తలాఖ్ ఇచ్చాడు. అయితే ఈ దంపతుల మధ్య వివాదాన్ని పరిష్కరిస్తానంటూ ఓ తాంత్రికుడు ఎంటర్ అయ్యాడు. మీ మధ్య ఉన్న వివాదాన్ని తీర్చేస్తానంటూ ఆ భ‌ర్త‌ను తాంత్రికుడు న‌మ్మించాడు. దీంతో అత‌డి మాట‌లు న‌మ్మిన భ‌ర్త త‌న వ‌ద్ద హ‌లాలాకు భార్య‌ను పంపాల‌ని కోరాడు.

 

భార్య తాంత్రికుడి ప్లాట్‌కు వెళ్లింది. అక్క‌డ ఆమెను హ‌లాలా చేస్తాన‌ని న‌మ్మించి.. ఆమెను మాట‌ల్లోకి దింపి అత్యాచారం చేశాడు. అనంతరం ఆ మహిళను తన భర్తకు అప్పగించాడు. ఆ త‌ర్వాత భ‌ర్త నీకు హ‌లాలా అయ్యింద‌ని... హలాలా అయిన నీతో కాపురం చేయ‌నంటూ నిరాకరించాడు. దీంతో మోసపోయిన సదరు మహిళ.. భర్తపై, తాంత్రికుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో నిందితులిద్దిరినీ పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు.

 

ఏదేమైనా మ‌న దేశంలో మంత్ర‌గాళ్లు అవి చేస్తాం.. ఇవి చేస్తాం అంటూ చాలా మంది అమాయ‌కుల‌ను న‌మ్మిస్తూ వారిని మోసాలు చేస్తున్నారు. గ‌తంలో సైతం ఎంతో మంది మంత్ర‌గాళ్లు స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాం అంటూ ఎంతో మంది  అమ్మాయిల‌పై రేప్ చేసినా... వీటికి చెక్ ప‌డ‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: