ఆలయంలోని విగ్రహాలు మాట్లాడుకోవటం అసలు మీరు విన్నారా.. అయినా విగ్రహాలు మాట్లాడుకోవటం ఏంటని ఆశర్యపోతున్నారా..?? కానీ ఇది నిజమండి.. ఓ ఊరిలో చీకటి పడితే చాలు.. ఎక్కడి నుంచో మాటలు వినిపిస్తుంటాయి. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు.. ప్రతి రోజు. ఆ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకొనేందుకు గ్రామస్తులు చాలాసార్లు ప్రయత్నించారు. చివరికి గుడి నుంచి వస్తున్నాయని తెలుసుకుని లోపలికి వెళ్లి చూశారు. కానీ, ఎవరూ లేరు. మాటలు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి. చివరికి ఆలయంలోని గర్భగుడిలో ఉండే విగ్రహాల నుంచి వస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ విషయం పరిశోధకులు సైతం తెలిసింది. 


ఈ ఆలయం బీహార్‌ లో 400 ఏళ్ల కిందట బస్తర్‌లో రాజ రాజేశ్వరి త్రిపుర సుందరి ఆలయాన్ని అప్పటి రాజులు  నిర్మించారు. తాంత్రిక శక్తులను పొందడానికి, తాంత్రిక పూజలను చేసేందుకు అప్పట్లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఉదయం వేళల్లో ఎంతో సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది. కానీ రాత్రయితే చాలు గుడిలోనుంచి మాటలు వినిపిస్తుంటాయి. 

 

ఈ ఆలయం గురించి తెలుసుకున్న కొంత మంది శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ, ఫలితం దక్కలేదు. అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా ఈ మిస్టరీని తెలుసుకోవడం విఫలమయ్యారంటే.. అది నిజంగా చిత్రమే. ఇప్పుడే కాదు.. కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, చిన్న ఆధారం కూడా దొరకలేదు. అయితే, ఆలయ గర్భ గుడి నుంచి గుర్తుపట్టలేని మాటలు వినిపించాయని పరిశోధకులు తెలిపారు.

 

సాధారణంగా ఆలయాల  నిర్మాణంలో కలశ స్థాపన చేస్తారు. అయితే, ఈ ఆలయాన్ని తాంత్రిక శక్తుల కోసం నిర్మించిన నేపథ్యంలో ఇక్కడ కలశ స్థాపన చేయలేదు. ఈ ఆలయంలో దుర్గాదేవి వివిధ అవతారాల్లో కనిపిస్తుంది. త్రిపురా, ధూమవతి, బగులముఖీ, తారా, కాలీ, చిన్మస్త, శోదాశీ, మాతాంగి, కమలా, ఉగ్ర తార, భువనేశ్వరి తదితర అమ్మవారి విగ్రహాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. రాత్రి వేళల్లో ఈ విగ్రహాలు మాట్లాడుకుంటాయని స్థానికులు చెబుతుంటారు. ఒకప్పుడు ఇళ్ల వరకు ఆ మాటలు వినిపించేవని, ఇప్పుడు ఆలయం సమీపానికి వెళ్తేనే వినిపిస్తున్నాయని వారు తెలిపారు. ఒకవేళ మీకు కూడా ఆ మాటలు వినాలని ఉంటె మీరు అక్కడికి వెళ్ళండి

మరింత సమాచారం తెలుసుకోండి: