తెలంగాణ సీఎం కేసీఆర్  శాసనసభ సమావేశంలో భాగంగా ఆసక్తికర నిర్ణయాలు తీసుకోవడం జరిగింది . ఆర్థిక మాంద్యం ప్రభావం భారీగానే పడే అవకాశం ఉందని ముందే గ్రహించికొని అన్ని శాఖల్లో నిధుల ఖర్చుపై ముందే అంచనా వేసుకొని నియంత్రణ పాటించాలని అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

 

  గ్రామా పరిసరాలలో పచ్చదనం- పరిశుభ్రత పాటించాలి అని, ప్రజలందరి భాగస్వామ్యంతో గ్రామాల యొక్క రూపు రేఖలు మార్చలి అని తెలిపారు. ఈ దిశగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం - పల్లె ప్రగతి పురోగతిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ కొనసాగించారు. ప్రజల నుంచి గొప్ప స్పందన వచ్చిందని, ఈ కార్యక్రమం స్పూర్తిని కొనసాగించడంలో అధికారులు ఘొరంగా విఫలమయ్యారని సీఎం కేసీఆర్ ఆగ్రహం, అసహనము వ్యక్తం చేయడం జరిగింది.

 

 కాగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి -కేంద్రం ప్రభుత్వం నుంచి మనకు కు రావాల్సిన నిధులు, బకాయిలు తదితర మొదలగు ఆర్థిక అం శాలపై కేబినెట్ విస్తృతంగా చర్చించింది. ఆర్థిక మాంద్యం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆదాయాలు గణనీయంగా పడిపోయాయని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తెలియచేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అన్ని శాఖల అధికారులు కఠినమైన ఆర్థిక నియంత్రణ ఖచ్చితముగా నియంత్రణ పాటించాలని సీఎం సూచించారు. బడ్జెట్ కేటాయింపులకు మించి ప్రతి శాఖలోనూ ఒక్క రూపాయి కూడా ఎక్కువగా ఖర్చు చేయడానికి వీల్లేదని చెప్పారు. అన్ని శాఖలు ఏమాత్రము అలసత్వము వహించకుండా విధిగా నియంత్రణ పాటించాల్సిందేనని, సరైన ఆర్థిక క్రమశిక్షణతోనే రాష్ట్ర పరిస్థితిని ఎదుర్కోగలమని తెలిపారు.

 

 ఈ నేపథ్యంలో  320 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్తు ఉత్పత్తి చేసే విధంగా దుమ్ముగూడెంలో గోదావరి నదిపై బ్యారేజి నిర్మించాలని, చెప్పారు. ఇందుకు రూ.3,482 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ బ్యారేజికి అయ్యే భారీ ఖర్చును రెండు సంవత్సరాల బడ్జెట్లలో కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా మిడ్ మానేరు వరకు 3వ టీఎంసీల నీటిని ఎత్తిపోసే పనులను చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రూ.11,806 కోట్ల అంచనా వ్యయంతో చేపట్ట దలచిన ఈ పనులకు సంబంధించిన ఖర్చులను కూడా రెండేళ్ల బడ్జెట్లో సమకూర్చాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: