ఏపీ అసెంబ్లీలోసమావేశల నాల్గవ రోజు అయినా ఈ రోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్పై చేసిన వ్యాఖ్యలపై గొడవ జరిగింది ఉదయం సభలోకి వస్తున్న సమయంలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు మార్షల్స్ కు మధ్య గొడవ జరిగింది.. ఈ సమయంలో బాబు ముఖ్యమంత్రి జగన్ను ఉన్మాది అని మాట్లాడారు. ఈ మాటలపై వైఎస్సార్సీపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
వెంటనే చంద్రబాబు క్షమాపణ చెప్పాలనిడిమాండ్ చేసారు .. లేకపోతె ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని కోరారు . దీనిపై టీడీపీ అభ్యంతరం తెలిపింది.. సభ బయట జరిగిన విషయానికి క్షమాపణ చెప్పమనడం ఎంతవరకు సమంజసం అని పేర్కొన్నారు . గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఉరి తీయాలని అని మాట్లాడారు అని గుర్తు చేశారు.
ఈ విషయంఫై మంత్రి అవంతి శ్రీనివాస్ టీడీపీ సభ్యుల పై మండిపడ్డారు. వైఎస్ బతినకున్నంత కాలం చంద్రబాబు తీరుఒకలాగా ఉండింది అని .. వైఎస్ చనిపోయాక ఒకలాగా ఉందని చంద్రబాబు వైఖరిలో చాలా మార్పు వచ్చిందన్నారు.ఇక రాష్ట్రానికి నేనే నాయకుడ్ని చంద్రబాబు అన్నట్లు వ్యవహరించారని అని అయన మాట్లాడారు . తాను వైఎస్సార్సీపీలోకి వెళ్లి మంత్రి అవుతానని చంంద్రబాబుకే చెప్పానని..
నువ్వు వైసీపీలోకి వెళ్లినా.. ఆ పార్టీ ప్రభుత్వంలోకి రాదని చంద్రబాబు తనతో అన్నారనిఅయన వ్యాఖ్యానించారు .ఇక ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని.. జగన్ పిలిస్తే టీడీపీ 80శాతం ఖాళీ అవుతుందని.. తన గౌరవాన్ని చంద్రబాబు తగ్గించుకోవద్దన్నారు. ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని.. వెనక్కు తీసుకుంటే హుందాగా ఉంటుందన్నారు.ఆయన గౌరవం దక్కించుకున్నవాడుఅవుతాడు అని వ్యాఖ్యానించారు
ఇక చంద్రబాబు, వ్యాఖ్యలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే తనను ఏడాదది పాటూ సస్పెండ్ చేశారని.. తనను సస్పెండ్ చేయడం సరికాదని సుప్రీంకోర్టు అప్పుడు చెప్పిందన్నారు. హైకోర్టు ఆర్డర్ ఉన్నా తననుఅసెంబ్లీ లోకి రాకుండా చేశారని..