ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా, ఆంధ్ర పప్పు అబ్బో ఇలా ఒకటి కాదు.. రెండు కాదు బోలెడు పేర్లు ఉన్నాయి నారా లోకేష్ బాబుకి. ఎప్పుడు ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలతో తిట్టించుకుంటాడు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.          

 

ఎప్పుడు ట్విట్టర్ లో ప్రతిపక్ష నేతలను కడిగి పారేసే విజయసాయి రెడ్డి ఈరోజు నారా లోకేష్ ని కూడా దారుణంగా కామెంట్లు చేశారు. కొడుకుపై ప్రేమతో వర్ధంతికి, జయంతికి తేడా తెలియని పప్పుని కూడా మంత్రిని చేశాడు.. కర్మ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్విట్ నెటిజన్లు కూడా ఓ రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. 

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ 'వర్ధంతికి, జయంతికి తేడా తెలియకుండా మాట్లాడితే మీరన్నట్టు ప్రాజెక్టులేమీ ఆగిపోవు చిట్టి నాయుడు? ఇంత జ్ఞాని మనకు మంత్రిగా పనిచేశాడా అని ప్రజల మనసులు క్షోభించాయి. విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు కొడుకు అవడం వల్లనే ఎమ్మెల్సీ, మంత్రి అయ్యాడని అందరి అభిప్రాయం.' అంటూ ట్విట్ చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: