ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

                                   

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ 'రాయలసీమలో మూడొంతులు పూర్తయిన ప్రాజెక్టులను వదిలేసి కమిషన్ల కోసం కొత్త పనులు చేపట్టాడు చంద్రబాబు నాయుడు గారు. కిరసనాయిలు వాటాగా కొన్ని పనులను 100 నుంచి 200 శాతం అంచనాలు పెంచి ఒక రాజ్యసభ సభ్యుడికి కట్టబెట్టాడు. ఇవన్నీ ప్రజలకు తెలిసే రెండు సీట్లకు పరిమితం చేసి గుణపాణం చెప్పారు.' అంటూ ట్విట్ చేశారు. 

 

దీంతో నెటిజన్లు కూడా ఈ ట్విట్ పై స్పందిస్తూ.. 'చంద్రబాబు ఆంతే.. ఎన్ని గుణపాఠాలు చెప్పిన ఆయనకు బుద్ధిరాదు అంటూ ఒకరు కామెంట్ చేస్తే మరొకరు స్పందిస్తూ.. చంద్రబాబు గురించి ఎంత మాట్లాడిన అంతే.. పెద్ద ఉపయోగం ఎం ఉండదు అంటూ కామెంట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: