సమాజంలో మానవ మృగాలు రోజు రోజుకు ఊహించని విధంగా పసి పల్లలని కూడా చూడకుండా మానభంగం చేసి మరీ పొట్టన పెట్టుకుంటున్నారు. అడవిలో అయినా ఆడ పిల్లలకి భద్రత ఉంటుదేమోగాని సమాజంలో మాత్రం ఉండటం లేదు. ఆడపిల్లలు ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా..తమలోని మృగాన్ని నిద్రలేపుదామా అని కామం నిండిన కళ్ళతో కాచుకుని ఉంటున్నారు. దిశ సంఘటనము మరువక ముందే మరో పసి పాపని బలితీసుకున్నాడు మనిషి రూపంలో ఉన్న ఒక మృగం.  మహారాష్ట్రలో ఈ అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. 

 

ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు ఆ పసిబిడ్డను కిరాతకంగా చంపేసి స్నేహితుడి సాయంతో సిమెంట్ కాంక్రీట్‌లో వేసి ఖననం చేసేశాడు. వింటుంటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మహారాష్ట్రలోని ఉత్తాన్ జిల్లాలో వెలుగుచూసింది. ఉత్తాన్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు అపహరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో గొంతు నులిమి చంపేశాడు. 

 

బాలిక శవం దొరక్కుండా ఉండేందుకు తన స్నేహితుడిని సాయంతో బాలిక శవాన్ని ఓ భవన నిర్మాణ ప్రాంతానికి తీసుకెళ్లి ప్లాస్టిక్ డ్రమ్ములో వేశారు. సిమెంట్ కాంక్రీట్‌తో ఆ డ్రమ్మును నింపి ఓ నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు బాలిక శవాన్ని గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చివరికి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తమ కన్న బిడ్డ కనిపించలేదని భయపడుతున్న తల్లి తండ్రులకు ఒక్క సారిగా గుండె బద్దలయ్యో వార్త విని శోక సముద్రంలో మునిగిపోయారు. ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని రకాల శిక్షలు అమలు చేసినా ఇలాంటి కీచకులు ప్రతీ చోటా ప్రతీ రోజూ ఒక అమాయకమైన ఆడ పిల్లని బలి తీసుకుంటూనే ఉన్నారు. దీనికి పరిష్కార మార్గమే కనిపించడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: