జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ముప్పతిప్పలు పెడుతున్నాడు. ఇదే కోవలోకి మరో అధికారి చేరాడు అతనే ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌‌.. ఇప్పుడు ఈయనను  విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జగన్ సర్కారు తెలిపింది.. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన ఈయనపై అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్‌ చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రకటించింది.

 

 

ఇకపోతే పరిశ్రమలు, మౌలిక వసతులశాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం.. టీడీపీ ప్రభుత్వం హయాంలో కృష్ణ కిశోర్‌‌ జరిపిన అక్రమాలపై విచారణ చేపట్టాలని సీఐడీ, ఏసీబీ డీజీలను ఆదేశించింది. అంతే కాకుండా ఈ విచారణ ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించింది. ఇక కృష్ణ కిశోర్‌ విచారణ పూర్తయ్యే వరకు అమరావతి విడిచి వెళ్లొద్దని ఆదేశించింది.

 

 

అవినీతి ఆరోపణలో ఇతనితో పాటుగా  శ్రీనివాస్ రెడ్డి అనే మరో అధికారిని కూడా జగన్ సర్కారు సస్పెండ్ చేసింది. ఇక సీఎం ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు కు  చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆ సమయంలో చంద్రబాబు ఆయన్ను గతంలో మూడేళ్ల పదవీ కాలానికి ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా నియమించారు. 1990 బ్యాచ్‌కు చెందిన కృష్ణ కిశోర్.. అంతకు ముందు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు వద్ద సెక్రటరీగా పని చేశారు.

 

 

చార్టర్డ్ అకౌంటెంట్ అయిన కృష్ణ కిశోర్.. ఐఆర్ఎస్ కావడానికి ముందు హైదరాబాద్‌లోని ఓ సంస్థలో పని చేశారు. ఇకపోతే జీఏడీ అసిస్టెంట్ సెక్రటరీ జయరాం, సెక్షన్ ఆఫీసర్ అచ్చయ్యలకు ప్రభుత్వం తిరిగి పోస్టింగ్ ఇచ్చింది. ఇదివరకు వీరిద్దరు సచివాలయంలో సస్పెండ్ అయ్యారు.. అదేమంటే ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరి బదిలీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై ప్రభుత్వం వీరిని సస్పెండ్ చేసింది. పని ఒత్తిడి వల్ల తప్పు జరిగిందని భవిష్యత్తులో పొరపాటు జరగకుండా జాగ్రత్తపడతామని వీరిద్దరూ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. అందుకే జగన్ సర్కారు తిరిగి పోస్టింగ్ ఇచ్చింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: