నిజంగా ఆయన సిగ్గుపడాలి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నోట్లో నుంచి వచ్చిన మాట బాస్టర్డ్‌ అని. ఒక ఉద్యోగిని పట్టుకుని చంద్రబాబు బాస్టర్డ్‌ అనడం ఎంతవరకు సమంజసం. దీనికి ఆయన సిగ్గుపడాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ప్రారంభమైన శాసన సభ సమావేశంలో మార్షల్స్‌పై ప్రతిపక్షనేత, ప్రతిపక్ష సభ్యుల దౌర్జన్యంపై ప్రస్తావన వచ్చింది. సభ్యులు లేవనెత్తిన ఈ అంశంపైనా సీఎం వై ఎస్ జగన్ జోక్యం చేసుకుని చేసుకున్నారు.  ఆ గేట్లలో నుంచి ఊరేగింపుగా వస్తున్నప్పుడు ఎవరు సభ్యుడు, ఎవరు సభ్యుడు కాదోనని మరి చూసుకుని లోపలికి పంపించేందుకు కొన్ని భద్రతా నిబంధనలు పెట్టారు. 
ఈ విషయంలో మార్షల్స్‌ వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారని సీఎం జగన్ స్పష్టం చేశారు. మొత్తం దృశ్యాలన్నీ చూస్తే.. ఎవరు, ఎవరిమీద దౌర్జన్యం చేశారో అర్థం అవుతోంది.


అసలేం జరిగిందంటే.. 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ ప్రాంగణంలో అసలేం జరిగిందంటే... భద్రతా సిబ్బందిపై చంద్రబాబు దారుణంగా ప్రవర్తించారు. వాస్తవానికి అసెంబ్లీలో అధికార పక్షానికి, ప్రతిపక్షానికి చెందిన సభ్యులకు ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిన మర్యాద భద్రతా సిబ్బంది విధి. ఈ ప్రకారమే ఈ రోజు కూడా వాళ్ళు తమ విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు. అయితే ప్రతిపక్ష నేతగా చంద్రబాబు  రోజూ తాను రావాల్సిన గేటులో నుంచి రాకుండా మరో గేటు నుండి ప్రవేశించారు. ఈ విషయంలో అసెంబ్లీ భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దానితో బాబొరికి చిర్రెత్తికొచ్చిందిగా. ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు గేటు నంబర్‌ –2 ద్వారా శాసన సమావేశాలకు హాజరు కావాల్సి ఉంది. 


గేటు నంబర్‌–2 ద్వారా
గేటు నంబర్‌–2 ద్వారా కాకుండా కాలినడకన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు కాని వాళ్లు, పార్టీ కార్యకర్తలు, తన బ్లాక్‌ క్యాట్‌ కమాండోలు ఇలా అందరితోపాటు ఒక ఊరేగింపుగా గేట్లలోనుంచి వచ్చారు. సభ్యులను మాత్రమే ప్రవేశపెట్టాల్సిన ఉన్న నేపథ్యంలో మార్షల్స్‌ ప్రవేశద్వారం వద్ద నియంత్రణలు పెట్టారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకుని బాస్టర్డ్‌ అని అనడం అంటే ఎంత దారుణం. లోకేష్‌ అనే వ్యక్తి నాలుగు అడుగులు ముందుకు వేసి ఏకంగా అధికారులను గొంతుపట్టుకున్నారు. ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఎవరు ఎవరిమీద దౌర్జన్యం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: