గత కొన్ని సంవత్సరాలుగా ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్థస్త్ షో ఎంత పాపులర్ అయిందో మన అందరికి తెలిసిందే.. ఈ జబర్దస్త్ షోతో చాలా మంది ఎంటర్ ఇచ్చి మంచి కమెడియన్స్ గా పేరు సంపాదించుకున్నారు. అంతేకాదు వీరు సినిమాల్లో కూడా ఛాన్స్ దక్కించుకుని వారి సత్తా చాటుతున్నారు. ఈ షో రోజా గారు, నాగబాబు గారు జడ్జెస్ గా వ్యవహరించేవారు. గత కొన్ని కారణాల వలన గత కొన్ని రోజుల క్రితం నాగబాబు గారు జబర్దస్త్ షో నుండి జడ్జ్ గా తప్పుకున్నారు.
దీంతో బాబు పక్కకు తప్పుకోవడం వలన నిర్వాహకులు ఈ షో రేటింగ్స్ లో ఏమన్నా ఛేంజెస్ వస్తాయా అని భయపడ్డారు. కానీ ఈ జబర్డస్త్ షో ఎప్పటిలాగే తన స్థానాన్ని పక్కకి పోనివ్వకుండా సుస్థిరం చేసుకుంది. దీంతో ఈ షోలో జడ్జ్గా వ్యవహరించే నాగబాబు గారు కూడా లేకున్న ఆడియన్స్ మాత్రం ఈ జబర్ధస్త్ కామెడీ షోని చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారన్న సంగతి వారికి స్పష్టమైంది.
ఇక నాగబాబు లేకపోయినా.. జబర్దస్త్ కామెడీ షో దాని బ్రాండింగ్ తో పాటు రేటింగ్ ను నిలబెట్టుకుంది. ప్రస్తుతం ఈ షోలో రోజా ఒక్కరే జడ్జ్గా వ్యవహరిస్తున్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే అన్ని ప్రోగ్రామ్స్ కంటే ఈ షోకే రేటింగ్స్ ఎక్కువ. కానీ తాజాగా బార్క్ ప్రకటించిన రేటింగ్స్లో ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ షో కు గట్టి షాక్ ఇచ్చింది ఈటీవీ న్యూస్. ఈటీవీలో ప్రతి రోజు ఉదయం 7 గంటలకు, రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఈటీవీ న్యూస్.. జబర్దస్త్ షో రేటింగ్స్ ను క్రాస్ చేయడం నిర్వాహకులను కలవరపెడుతోంది.
అయితే.. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం కీలక బిల్లులను ఆమోదించుకునే పనిలో ఉంది. కాబట్టి అందుకే ఎక్కువ మంది జబర్దస్త్ కామెడీ షో కంటే న్యూస్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం స్పష్టమైంది. మరి వచ్చే వారం ఇదే పరిస్థితి ఉండదనే చెప్పాలి మరి.