ఈ శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ప్రతిపక్షం అలాగే అధికార పక్షం ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ సభను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు వైఎస్సార్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.

 

పురాణాల్లో ఘోర రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేసాడు. శివుడు వచ్చి వరం కోరుకోమంటాడు. నువు ఇంత త‌్వరగా వస్తావనుకోలేదు కాస్త ఆగు ఆలోచించుకుని అడుగుతానంటాడు రాక్షసుడు. ఇంతలోనే అక్కడకొచ్చిన దేవతలు కొందరు అతడు ఘోరమైన రాక్షసుడు, అతడికేమీ వరాలు ఇవ్వకండి అన్నారు దానితో శివుడు ఆలోచనలో పడ్డాడు.

 

ఆ రాక్షసుడిని ఆపుదామని ఆలోచించి సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువులన్నీ లెక్కబెట్టుకుని రా అని చెప్పాడు. అయితే రాక్షసుడు లెక్కబెట్టుకుని త్వరగా వచ్చేస్తాడు. దీని తర్వాత శివుడు ఆకాశంలోని చుక్కలన్నీ లెక్కబెట్టుకుని రమ్మంటాడు. అదీ చేసేస్తాడా రాక్షసుడు. ఏం చెప్పినా వెంట వెంటనే చేసుకుని వచ్చేస్తున్న రాక్షసుడిని చూసి ఏం చేయాలో పాలుపోక శివుడు ఆలోచిస్తున్నప్పుడు ఓ వ్యక్తి వచ్చాడు. రాక్షసుడు తిరిగి రాకుండా ఉండేదుకు శివుడికి ఓ మంచి ఐడియా ఇచ్చాడు. అదేంటంటే ఈ రాక్షసుడిని వెళ్లి చంద్రబాబు అబద్ధాలు లెక్కపెట్టి రమ్మని చెప్పాడు. ఇక ఆ రాక్షసుడు ఇప్పటికీ ఎప్పటికీ రాడు. రాలేడు. శివుడిని వరం అడిగలేడు. బాబుగారి అనుభవం ఎలాంటిదంటే అబద్ధాలు ఆడటంలో దిట్ట.ఆ కథతో ఎం మాట్లాడాలో తెలియక చంద్రబాబు నోరుమూసుకుని  ఉన్నారు.  

 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా సిగ్గుతో తలదించుకునేలా మాట్లాడి నేడు కళ్లముందే నిజం కనిపిస్తున్నా నేను ఏమీ చేయలేదు, ఏమీ అనలేదు అంటూ సభలోనే, స్పీకర్ ముందే అబద్ధాలు ఆడేస్తున్నాడు. కోట్లు రూపాయిల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతూ చంద్రబాబుకు బ్లాక్ కాట్ కమాండోస్ తో రక్షణ కల్పిస్తున్నారు. ఆయన రావాల్సన గేట్ నుంచి రాకుండా ఇంకో గేట్ నుంచి వచ్చాడు. ఇది కేవలం ఆయన పబ్లిసిటీ పిచ్చి కోసమే. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్కరూ చంద్రబాబుకు సిగ్గు, శరం, మానం, అభిమానం, చీమూ, నెత్తురూ ఉన్నాయని అనుకోరు. చంద్రబాబు అసెంబ్లీలో అరవమని బుచ్చయ్య చౌదరి భుజాలు గిల్లి గిల్లీ పెట్టడంతో ఆపరేషన్ చేయాల్సొచ్చిందట.
 

మరింత సమాచారం తెలుసుకోండి: