అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్న సమయంలో నిన్న మార్షల్స్‌పై పై చంద్రబాబు టిడిపి సభ్యులు చేసిన దాడిని చూసిన వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గొల్లబాబు రావు చంద్రబాబుకి వయసు పెరిగింది కానీ మనసు పెరగలేదని అలాగే భగవంతుడు జ్ఞానం ఇవ్వడం మరిచిపోయాను అని ఎద్దేవా చేశారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులని పట్టుకొని చంద్రబాబు ఒక ఉన్మాదిగా మాట్లాడారు అని ఆయన అన్నారు. మొదటి నుంచి కూడా చంద్రబాబుకి ఉద్యోగులు అంటే చులకనా అని నిన్న జరిగిన సంఘటనతో ఉద్యోగస్తులు అందరికీ ఇది ఎంతో అవమానంగా భావిస్తున్నారు అని చెప్పారు.

 

 అసెంబ్లీలో ఎమ్మెల్యే గొల్ల బాబురావు మాట్లాడుతూ ‘నిన్న జరిగిన సంఘటన కళ్లారా గేటు దగ్గర చూశాను. ఎంతటి దారుణం అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఉద్యోగస్తులను పట్టుకొని ఒళ్లంతా ఒకరకమైన ఉన్మాదంతో మాట్లాడాడు. నేను దానికి సాక్షం కూడా.. నేను వైజాగ్‌ జిల్లాలో జెడ్పీ∙సీఈఓగా పనిచేస్తున్నప్పుడు చంద్రబాబు రెవెన్యూ, ఆర్థిక శాఖల మంత్రిగా ఉన్నారు. నిజంగా చెబుతున్నా చంద్రబాబుకు ప్రభుత్వ ఉద్యోగులు అంటే చులకన, అందులోనూ మాలాంటి పేదవర్గానికి చెందిన ఉద్యోగులు అంటే మరీ చులకన. నిన్న జరిగిన సంఘటన ప్రభుత్వ ఉద్యోగులందరికీ నిజమైన అవమానంగా భావిస్తున్నాను.


బాబుకు వయస్సు పెరిగింది కానీ, మనస్సు పెరగలేదు. జ్ఞానం అనేది భగవంతుడు చంద్రబాబుకు ఇవ్వలేదు. సభ సాక్షిగా చెబుతున్నా.. సీఎం వైయస్‌ జగన్‌ ఎన్ని కష్టాలు పడినా.. పదేళ్లలో చంద్రబాబును, ఎవరినైనా ఒక్క దుర్భాష కూడా మాట్లాడలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్మాదంలా ప్రవర్తించారు. ఐదు కోట్ల మంది ప్రజలంతా టీడీపీ తీరుపై బాధపడుతున్నారు.

 

ప్రతిపక్షానికి ఆలోచన ఉంటే ఈ పాటికే క్షమాపణ చెప్పి ఉండాలి. పేదల కోసం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని చంద్రబాబు ఏమన్నా.. 5 కోట్ల మంది ప్రజలు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు గమనిస్తున్నారు. టీడీపీకి కనీసం డిపాజిట్లు కూడా రాకుండా చేస్తారని గమనించాలని ఎమ్మెల్యే బాబురావు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: