ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

          
 
విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ 'సమయం, సందర్బం లేకుండా 40 ఏళ్ల అనుభవం గురించి, 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ముచ్చట్లు, సెల్ ఫోన్లు తెచ్చానన్న కోతలు, ఉన్నవవీ లేనివీ చెప్పుకున్నది తమరే కదా బాబూ? ఇప్పుడు అదే విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తే నొచ్చుకోవడమెందుకు? చంద్రబాబు' అంటూ ట్విట్ చేశారు. 

            
 
దీంతో నెటిజన్లు కూడా ఈ ట్విట్ పై స్పందిస్తూ.. 'చంద్రబాబు ఆంతే.. అన్ని తానే చేసినట్టు చెప్పుకుంటాడు.. రాజకీయంలో 40 ఏళ్ళ అనుభవం అంటాడు.. ఏమి ఉపయోగం ? అయన అనుభవమంతా కుర్రాడు ఘోరంగా అవమానించాడు అంటూ కామెంట్ చేశారు. మరికొందరు స్పందిస్తూ.. చంద్రబాబు గురించి ఎంత మాట్లాడిన అంతే.. పెద్ద ఉపయోగం ఎం ఉండదు అంటూ కామెంట్ చేశారు. కాగా ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: