ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

            

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ ' చంద్రబాబుకు ఆయన దత్తపుత్రుడు ఎప్పటికీ మారరు. ఎక్కడా లేని విధంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్ గారిని అభినందించే గొప్ప మనసు లేదు. జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని కేంద్ర ఆదేశాల కంటే ముందే ఏపీలో ప్రవేశపెట్టారు. దిశ చట్టం ఎంత సాహసోపేతమైనదో ప్రశంసించడానికి వాళ్ళకి  నోరు రాదు.' అంటూ ట్విట్ చేశారు. 

     

దీంతో నెటిజన్లు కూడా ఈ ట్విట్ పై స్పందిస్తూ.. 'చంద్రబాబు ఆంతే.. ప్రశంసించడానికి ఆయనకు అయన దత్తపుత్రుడుకు రాదులెండి' అంటూ కామెంట్ చేశారు. మరికొందరు స్పందిస్తూ.. వారి గురించి మాట్లాడకండి సారు.. పెద్ద ఉపయోగం ఎం ఉండదు అంటూ కామెంట్ చేశారు. కాగా ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

     

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: