లోకంలో ఇప్పుడున్న పెట్టుబడి డబ్బు కాదు నమ్మకం. ఒక మనిషిని నమ్మిస్తే అతన్ని ఎంతకైనా మోసం చేయవచ్చూ. అతను నమ్మినంత కాలం సర్వం దోచుకోవచ్చూ. ఇక నిజం తెలిసే లోపల ఎలాగో జరగ వలసింది జరిగిపోతుంది. కాబట్టి అతను ఏం చేయలేడు అనే ధీమా మనుషుల్లో బలంగా నాటుకుంది. ఇక ఇప్పుడు సర్వసాధారణమైన విషయం ఏంటంటే అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేయడం. ఇదిగో ఇప్పుడు ఇలాగే జరిగింది.

 

 

ఆ  మైనర్ బాలిక వెంట ప్రేమిస్తున్నానంటూ పడ్డాడు. అందరి లాగే సినిమా డైలాగ్ నువ్వు లేకుంటే చచ్చిపోతానంటూ పలికాడు. బెదిరించాడు. చివరికి ప్రేమ పేరుతో నమ్మించి మైనార్టీ తీరకముందే పెళ్లి చేసుకున్నాడు. ఫలితంగా ఓ బిడ్డ జననానికి కారణమయ్యాడు. కానీ పెళ్లయిన కొద్ది నెలల నుంచే భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఘోరంగా హింసించ సాగాడు. చివరకు బిడ్డ గొంతు కోసి, భార్య తలను బండకేసి మోది అంతమొందించాడు. ఇన్నాళ్ల ప్రేమ గుర్తుకు రాలేదా ఈ చెత్త వెదవకు అని అందరు అనుకుంటున్నారు.

 

 

ఇకపోతే ప్రకాశం జిల్లా ఒంగోలులో తల్లీబిడ్డలను హత్య చేసి తగులబెట్టిన కోటేశ్వరరావు దారుణాలివి! నిందితుడి అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న కొద్దీ.. కోటేశ్వర రావు రూపంలో నరరూప రాక్షసుడు లోకంలో సంచరిస్తున్నాడని చెప్పక తప్పదు.  మైనర్ బాలిక అయిన శ్రీలక్ష్మిని ప్రేమ పేరుతో వంచించి పెళ్లి చేసుకున్న కోటేశ్వర రావుకు భార్యపై అనుమానం ఏ స్థాయిలో ఉండేదంటే ఆమె జడను సైతం ఇంట్లోనే కత్తిరించేశాడు.

 

 

అంతే కాకుండా ఈ నెల 2, 3 తేదీల్లో భార్యను తీవ్రంగా కొట్టి ఇంటి నుంచి వెళ్లిపొమ్మంటూ రూ. 50 ఇచ్చి నెల్లూరు బస్టాండ్‌లో వదిలేశాడు. అయితే శ్రీలక్ష్మి దెబ్బలు తట్టుకోలేక వైద్యుడికి చూపించుకునేందుకు ఆస్పత్రికి వెళ్లింది.  ఈ నేపథ్యంలోనే ఆస్పత్రికి వచ్చిన భార్యను నమ్మకంగా బైక్ ఎక్కించుకుని తనతో తీసుకెళ్లి పక్కా ప్రణాళిక ప్రకారం ముందుగా 11 నెలల  చిన్నారి వైష్ణవిని కత్తితో గొంతు కోసి చంపి, ఆ తర్వాత భార్య శ్రీలక్ష్మిని బండరాయి కేసి మోది దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు.. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి చివరికి కేసును చేదించి నిందితున్ని కటకటాల వెనక్కి పంపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: