ప్రతీ ఒక్కరికి దేవుడు కంటే ముందు కన్న తల్లినే అన్ని రకాల దేవుళ్ళుగా పూజించాలి. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి ఏ దేవతకి సమానం కాదని ఎంతోమంది అభిప్రాయపడతారు. అంతటి మాతృమూర్తి పైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఒక నీచ కామాంధుడు. ఇలాంటి వాడిని నిలువునా చీల్చినా పాపం లేదు. ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌‌లో వెలుగుచూసింది. పట్టణానికి చెందిన అదురు మహిళ భర్త ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఎన్నో కష్టాలకు ఓర్చిన ఆతల్లి ఆస్పత్రిలో పనిచేస్తూ నలుగురు పిల్లలను పోషిస్తోంది.

 

అయితే తల్లికి అండగా నిలవాల్సిన ఆమె పెద్దకుమారుడు(20) మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బులు కావాలని తల్లిని తరుచూ వేధించేవాడు. ఇవ్వకపోతే ఆమెను తీవ్రంగా కొట్టేవాడట. ఇటీవల మరింత ఉన్మాదిలా మారిన ఆ యువకుడు తల్లి అని కూడా చూడకుండా ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే బాధపడుతూ కుమిలిపోయింది.

 

దీన్ని అలుసుగా తీసుకున్న ఆ కామాంధుడు మరింత రెచ్చిపోయాడు. రోజూ తన ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు పడుకున్నాక తల్లిని గదిలోకి తీసుకెళ్లి బెదిరించి అత్యాచారం చేసేవాడు. తన మాట వినకపోతే అందరినీ చంపేస్తానని బెదిరించేవాడు. అయితే అతడి పైశాచికం మరింత ఎక్కువ కావడంతో బాధితురాలు బుధవారం ఔరంగాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కొడుకు మూడు నెలలుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధితురాలు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. వెంటనే కేసు నమోదు చేసి ఈ కామాంధుడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయం తెలిసిన కొంతమంది అసలు వాడిని పోలీసులకి అప్పగించకుండా కన్న తల్లివి నువ్వే కడతేరిస్తే బావుండేది..నీకు పట్టిన దరిద్రం వదిలిపోయోదని సలహా ఇచ్చారట. దిశ లాంటి సంఘటనలతో ఎన్ని ఎన్‌కౌంటర్స్ జరుగుతున్నప్పటికి కొత్త చట్టాలు అమలు చేస్తున్నప్పటికి కామాంధులు తల్లిని చెల్లిని కూడా వదలడం లేదు. ఇలాంటి నీచులకు తగిన శిక్ష మరణ శిక్షే.

మరింత సమాచారం తెలుసుకోండి: