ఆడదంటే ఎప్పటికి సుఖాన్నిచే విలాస వస్తువుగానే భావిస్తున్నాడు మగాడు. నేటికాలంలో మహిళలు అన్ని రంగాల్లో ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతున్న వారికి మితిమీరిన స్వేచ్చ ప్రసాదించిన మగవాడి చేతిలో మల్లెపువ్వుల్లా నలిగి పోతున్నారు. నాటి నుండి నేటివరకు ఆడదంటే విలాస వస్తువు అనే ధోరణి సమాజంలో కనిపిస్తుంది.

 

 

ఇకపోతే అక్కడక్కడ అమ్మాయి కనిపిస్తే చాలు ఎత్తుకెళ్లి అత్యాచారాలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల కోకొల్లలు. ఇది చాలదన్నట్లు కొందరు కామాంధులు తమను స్వామిజీలు, జ్యోతిష్కులుగా పరిచయం చేసుకుని, దోషాల పేరుతో అమ్మాయిల జీవితాలను పేపర్ లా చింపేస్తున్నారు. వారి జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. ఇదిగో ఇంతలా మీడియా మొత్తుకున్న మరో చోట ఈ తరహా మోసం జరిగింది. అదేమంటే ఓ జ్యోతిష్కుడు సర్పదోషం పేరుతో ముగ్గురు అక్కాచెల్లెళ్ల పై వరుసగా అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది.  ఈ ఘటన వివరాలు పరిశీలిస్తే.

 

 

మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలున్నారు. ఇటీవల వారి జాతకాలను ఓ జ్యోతిష్కుడికి చూపించగా, వారికి సర్పదోషం ఉందని, దాని నివారణ కోసం పూజలు చేయాలని నమ్మించాడు. ఆ నీచుడి మాటలు నమ్మిన ఆ కుటుంబం అతడు చెప్పినట్లే చేశారు. ఇక పూజలు చేసిన తర్వాత అమ్మాయిలను ఓ గదిలోకి తీసుకెళ్లాడు.  

 

 

అక్కడ ముగ్గురికి సర్పదోష విముక్తి చేస్తానని, కాబట్టి దరిదాపుల్లో ఎవరు ఉండొద్దని చెప్పి వారి తల్లిదండ్రులతో పాటు బంధువులను కూడా పంపించేశాడు. ఆ తర్వాత బాలికలను సమీపంలోని గదిలోకి తీసుకెళ్లిన జ్యోతిష్కుడు వారి దుస్తులు ఇప్పించి నగ్నంగా మార్చి, తనకు శారీరక సుఖం అందిస్తేనే సర్పదోషం పోతుందని మభ్యపెట్టి ముగ్గురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

 

 

కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన బాలికలు జరిగిన విషయం తండ్రికి చెప్పడంతో అంతా షాకయ్యారు. వెంటనే తేరుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆ కామాంధుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: